ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా రామ్ లక్ష్మణ్ చేశారు. అయితే, ఇటీవల నిర్వహించిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ లక్ష్మణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 3, 2025, 21:42:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ మూవీ అఖండ 2 తాండవం. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి విలన్‌గా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.

ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్
ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కామెంట్స్

బాలకృష్ణ కుమార్తె సమర్పణలో

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖండ 2 సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలాగే, బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పించిన ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేశారు.

రామ్ లక్ష్మణ్ కామెంట్స్

డిసెంబర్ 5న అఖండ 2 థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుడికి వచ్చిన ఫీలింగ్

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. "మేము ఎన్నో ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చూసాము. కానీ, ఈ వేడుక మాత్రం అందరం కలిసి ఒక గుడికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు. ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మనుషుల్ని భక్తి మార్గంలో నడిపించే ఒక అద్భుతమైన సినిమాని తీసుకొస్తున్న బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు" అని అన్నారు.

బాలయ్యలో శివశక్తి

"అఖండ 2 సినిమాలో బాలయ్య బాబు గారిలో ఒక శివశక్తిని చూశాం. అలాంటి శక్తితో ఫైట్స్‌ని అద్భుతంగా కంపోజ్ చేశాం. ఒక గుడికొచ్చి ఒక దివ్యమైన అనుభూతి పొందిన భావన కలిగిస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులకు నిర్మాతలకు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ , సినిమా యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని రామ్ లక్ష్మణ్ తెలిపారు.

ఆయన స్వాగ్ అమోఘం

ఇదే ఈవెంట్‌లో యాక్టర్ కబీర్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జై బాలయ్య. బాలయ్య గారి ఎనర్జీ అద్భుతం. ఆయన స్వాగ్ అమోఘం. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పారు.

కొత్తగా చూపిస్తున్నందుకు

"ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపిస్తున్న బోయపాటి గారికి ధన్యవాదాలు. బాలయ్య గారు పాన్ ఇండియా సూపర్ స్టార్. సినిమా టీజర్ ట్రైలర్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 5న అందరం థియేటర్స్‌లో కలుద్దాం" అని నటుడు కబీర్ చెప్పుకొచ్చాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More