బ్రహ్మముడి జనవరి 1 ఎపిసోడ్: కావ్య, అప్పుకు టార్చర్- ప్రకాశంకు నిద్రలో నడిచే అలవాటు- కావ్య కడుపు పోయేందుకు 2 పసరు మందులు
బ్రహ్మముడి సీరియల్ జనవరి 1 ఎపిసోడ్లో ఏ పని లేకుండా ఇంట్లో బోరింగ్గా ఉందని అనుకున్న అప్పు, కావ్య వెళ్లి కల్యాణ్, రాజ్ల వల్ల టార్చర్ కనిపిస్తుందంటారు. దాంతో హౌజ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశామని రాజ్, కల్యాణ్ చెబుతారు. కావ్య కడుపు పోవాలంటే 2 పసరు మందులు తాగించాలని రుద్రాణికి ఈరయ్య చెబుతాడు.
అంటుంది. కావ్య కడుపు సంగతి నేను చూసుకుంటా.. రాజ్ గాడి సంగతి నువ్వు చూసుకో అని రుద్రాణి అంటే.. అదే పనిలో ఉన్నానని రాహుల్ అంటాడు.
బ్రహ్మముడి సీరియల్ జనవరి 1 ఎపిసోడ్
ప్రశాంతంగా ఉంచకూడదు
మరోవైపు అప్పు దగ్గరికి కావ్య వస్తుంది. ఇద్దరు కలిసి హాల్లో టీవీ చూస్తారు. ఇలా తిని కూర్చోవడం బోరింగ్గా ఉందని అప్పు అంటుంది. మన హీరోలకు చెప్పి ఏదోటి చేయాలని ఇద్దరు కల్యాణ్, రాజ్ను చూస్తారు. వాళ్లు ఇద్దరు పనిలో ఉన్నారని కావ్య అంటే.. వాళ్లను ప్రశాంతంగా ఉంచకూడదు అని అప్పు అంటుంది. వారి దగ్గరికి వెళ్లి మమ్మల్నీ టార్చర్ చేస్తున్నారు.. మీరే అని అంటారు.
వాళ్లు ఏ పనిలేక పడుతున్న బాధల గురించి చెబుతారు అప్పు, కావ్య. అయితే, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అది రేపే చూడండి అని కల్యాణ్, రాజ్ వెళ్లిపోతారు. రాత్రి 12 గంటలకు రుద్రాణికి పసరు మందు ఈరయ్య కాల్ చేస్తాడు. ఎవరికి తెలియకుండా కిందకు వస్తుంది రుద్రాణి. వెనక్కి తిరగ్గానే ప్రకాశం ఉంటాడు. అది చూసి బెంబెలెత్తిపోతుంది రుద్రాణి.
రుద్రాణి ఏం మాట్లాడిన ప్రకాశం ఉలకడు పలకడు. ప్రకాశంకు నిద్రలో నడిచే అలవాటు ఉందని రుద్రాణి అనుకుంటుంది. రుద్రాణికి పసరు మందు ఇచ్చి ఇది కడుపులోకి వెళ్తే పిండం కకావికలం అవుతుంది. రేపు ఇంకో మందు ఇస్తాను. అది పూర్తిగా క్లీన్ చేస్తుందని ఈరయ్య చెప్పి వెళ్లిపోతాడు. కావ్య ఈ పసరు మందు వల్ల నా కూతురు ఈ ఇంటికి కోడలు కాబోతుంది. ఆస్తి మొత్తం వచ్చేలా చేయనుంది అని రుద్రాణి అనుకుంటుంది.
నిద్రలో నడిచే అలవాటు
మరుసటి రోజు ఉదయం ప్రకాశం రాత్రి హాల్లో పడుకున్న విషయం గురించి ధాన్యలక్ష్మీ అడుగుతుంది. తెలియదని ప్రకాశం అంటాడు. ఇంతలో రాజ్ వచ్చి ఇవాళ ఎవరు ఎక్కడికి వెళ్లకూడదు. ఈరోజు హౌజ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని రాజ్ అంటాడు. దానికి సుభాష్, ప్రకాశం తెగ సంతోషిస్తారు.
రాజ్, కావ్య గదిలోకి వెళ్లి కషాయంలో పసరు మందు కలుపుతారు రుద్రాణి, రేఖ. అడవిలో నుంచి తీసుకొచ్చిన ఈ మందు కచ్చితంగా కడుపులో ఉన్న పిల్లాడిని హరి అనేలా చేస్తుంది. ఈ పసరు కలిపిన కషాయం ఒక్కరోజులో రెండు సార్లు తాగితే చాలింక కడుపు పోతుంది అని రుద్రాణి హామీ ఇస్తుంది. అంటే బావ త్వరలోనే నా సొంతం అవుతాడని రేఖ అంటుంది.
గదిలో నుంచి రుద్రాణి, రేఖ వెళ్లిపోతారు. అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్, కల్యాణ్ వస్తారు. బౌల్లోని చిట్టీల్లో ఒక్కో యాక్టివిటీ ఉంది. అందులో ఉన్నట్లు చేయాలి అని రాజ్ చెబుతాడు. రేఖకు డ్యూయెట్ సాంగ్ వస్తుంది. సింగిల్గా ఎలా చేస్తాను అని రేఖ అంటే.. నీకోసం హీరో వస్తాడా అని ధాన్యం అంటుంది.
కషాయం తాగిన కావ్య
హీరో ఇక్కడే ఉన్నాడని రాజ్ను చూపిస్తుంది రేఖ. నేనా.. నేను చేయను అని రాజ్ చెబుతాడు. దాంతో రేఖ నిరాశపడుతుంది. కావ్యకు కషాయం ఇస్తాడు రాజ్. పసరు కలిపిన కషాయాన్ని కావ్య తాగుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.