బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్: భార్య దగ్గర అడ్డంగా ఇరుక్కుపోయిన ధర్మేంద్ర.. నిజం చెప్పేసిన డాక్టర్.. రాజ్ ప్లాన్ సక్సెస్
బ్రహ్మముడి బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ లో రాజ్, కావ్య వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. భార్య తులసి దగ్గర మంత్రి ధర్మేంద్ర అడ్డంగా ఇరుక్కుంటాడు. తులసికి డాక్టర్ అసలు నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 947వ ఎపిసోడ్ లో మంత్రి ధర్మేంద్ర భార్యను కనిపించకుండా చేసి తమ ప్లాన్ సక్సెస్ చేస్తారు రాజ్, కావ్య. తమ ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిన ధర్మేంద్రకు దిమ్మదిరిగే షాకిస్తారు. దీంతో చివరికి తన పాపను కావ్యకు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది.

దుగ్గిరాల ఇంట్లో వాళ్లను బెదిరించిన ధర్మేంద్ర
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ దుగ్గిరాల ఇంటికి మంత్రి ధర్మేంద్ర వచ్చి వారికి వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. మీ ఇంట్లో ఆరు శవాలు లేచేవి.. అందరూ కొద్దిలో తప్పించుకున్నారు.. ఇలా ఎందుకు జరిగిందో మీ కొడుకు రాజ్, కోడలు కావ్యకు తెలుసు.. వాళ్లను అడగండి.. మరోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే మీ ఇంట్లో ఎవరూ మిగలరు అని ధర్మేంద్ర చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. రాజ్ అతని కాలర్ పట్టుకొని అడిగినా అతడు వెనక్కి తగ్గడు. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు.
రాజ్ను నిలదీసిన ధాన్యలక్ష్మి, స్వప్న.. కావ్య క్షమాపణ
అతడు వెళ్లిపోగానే ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. అసలు అతనికీ, మీకు ఉన్న శతృత్వం ఏంటి? అతడు చెప్పింది జరిగి ఉంటే కడుపుతో ఉన్న కా కోడలు, ఒక్కగానొక్క నా కొడుకుకు ఏం జరిగి ఉండేది అంటూ రాజ్ ను నిలదీస్తుంది.
అటు స్వప్న కూడా ఇలాగే వాళ్లను అడుగుతుంది. అసలు వాడేం చేశాడో తెలుసా అని రాజ్ నిజం చెప్పబోతాడు. దీంతో కావ్య జోక్యం చేసుకుంటుంది. కేవలం బిజినెస్ శతృత్వమే అని, ఇక నుంచీ మీ జోలికి రాకుండా చూసుకుంటామని, ఇవాళ జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నానని అంటుంది.
ధర్మేంద్ర, రుద్రాణి పార్టీ
ఇటు దుగ్గిరాల కుటుంబాన్ని భయపెట్టి వచ్చిన సంతోషంలో రుద్రాణితో కలిసి ధర్మేంద్ర పార్టీ చేసుకుంటాడు. నువ్వు ఇచ్చిన ప్లాన్ వల్లే ఇలా జరిగింది.. ఇక రాజ్, కావ్య నా జోలికి రానే రారు.. వాళ్ల కళ్లలో భయం చూశాను అని రుద్రాణితో అంటాడు ధర్మేంద్ర. ఆమెను ఆకాశానికెత్తుతాడు.
నువ్వు రాజకీయాల్లో ఉంటే ఎక్కడికో వెళ్లేదానివని అంటాడు. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వడం లేదని అంటే.. టైమ్ వచ్చినప్పుడు అడుగుతానని అంటుంది. ఆ ఇంట్లో వాళ్ల పతనం, తన కొడుకు పట్టాభిషేకం ఒకేసారి జరుగుతాయని చెబుతుంది.
ఆవేశంతో రగిలిపోయిన రాజ్.. ఆలోచనతో కొట్టాలన్న కావ్య
ధర్మేంద్ర చేసిన పనికి రాజ్ ఆవేశంతో రగిలిపోతుంటాడు. దీంతో కావ్య అతనికి నచ్చజెపుతుంది. ఇప్పుడు తొందరపడితే నష్టపోయేది మనమే అని అంటుంది. చిన్న సాక్ష్యం కూడా వదల్లేదు కదా.. వాడు తప్పు చేశాడని ఎలా నిరూపించాలని రాజ్ అంటాడు. ఎంతటివాడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు.. ఈ విషయంలో డాక్టర్ చక్రవర్తి కనిపించకుండా పోయాడు.. అతన్ని దాచిపెట్టి ఓ సాక్ష్యాన్ని వదిలాడు కదా అని కావ్య అంటుంది. ముందు అతన్ని కనిపెడితే ధర్మేంద్రను ఇరికించవచ్చని చెప్పడంతో రాజ్ సరే అంటాడు. కావ్యకు కూడా ఓ ప్లాన్ చెబుతాడు.
ఇంట్లో కనిపించని తులసి.. ధర్మేంద్రకు రాజ్ ఫోన్
మరుసటి రోజు ఉదయం ధర్మేంద్ర ఇంట్లో తులసి కనిపించదు. అతడు కంగారుపడుతుంటాడు. దీంతో రాజ్ అతనికి ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదా.. నువ్వు దాచి పెట్టిన డాక్టర్ చక్రవర్తి దగ్గరికి ఆమెను తీసుకెళ్తున్నాను.. మరికాసేపట్లో ఆమెకు అసలు నిజం తెలుస్తుంది అని బెదిరిస్తాడు. దీంతో మంత్రిలో మరింత ఆందోళన మొదలవుతుంది.
చక్రవర్తి దగ్గరికి మంత్రి.. ఫాలో అయిన రాజ్
వెంటనే డాక్టర్ చక్రవర్తిని దాచిన చోటికి మంత్రి బయలుదేరుతాడు. అతని ఇంటి బయటే వేచి చూస్తున్న రాజ్ కూడా అతన్ని ఫాలో అవుతాడు. తన ప్లాన్ సక్సెస్ అవుతుంది. అటు హాస్పిటల్లో తులసితో ఉన్న కావ్య.. రాజ్ కు ఫోన్ చేస్తుంది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది.. వాడు డాక్టర్ చక్రవర్తిని దాచిన చోటికి వెళ్తున్నాడు.. నేను ఫాలో అవుతున్నాను.. తులసి నీతోనే ఉందా అని అడుగుతాడు. ఆమె తనతో ఉందని చెబుతుంది.
అటు తులసి తనను ఎందుకు హాస్పిటల్ కు రమ్మన్నారని కావ్యను అడుగుతుంది. పాలు సరిపోవడం లేదన్నారు కదా.. ఆయుర్వేదంలో మందు ఉంది.. అందుకే రమ్మన్నాను అని అంటుంది. నాకు ఇంత సాయం చేస్తున్నారు.. మీ పాప విషయంలో ఏమీ చేయలేకపోతున్నానని తులసి అంటుంది. టైమ్ వచ్చినప్పుడు అడుగుతాను.. అప్పుడు కాదనకుండా చేయండంటూ ఆమె చేతుల్లోని పాపను కావ్య ఎత్తుకుంటుంది.
ఇటు డాక్టర్ చక్రవర్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లి తులసికి అసలు నిజం చెప్పిస్తాడు రాజ్. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మేంద్ర వాళ్లను చూసి షాక్ తింటాడు. వాళ్లు చెప్పేదంతా అబద్ధం.. ఏదీ నమ్మకు అంటూ తన భార్యకు చెబుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


