...
...
Next Story

బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్: కావ్యకు చీర కట్టిన రాజ్.. మామయ్యలను అడ్డంగా ఇరికించిన కళావతి.. అత్తకు స్వప్న వార్నింగ్

బ్రహ్ముముడి సీరియల్ బుధవారం (నవంబర్ 12) ఎపిసోడ్ లో రాజ్‌తో తాను చేయించుకోబోయే కోరికల జాబితా చెబుతుంది కావ్య. అంతేకాదు రాజ్ ద్వారా తన మామయ్యను అడ్డంగా ఇరికిస్తుంది. అటు అత్త రుద్రాణికి స్వప్న చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

Published on: Nov 12, 2025, 07:04:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 876వ ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సంతోషంగా కనిపిస్తుంది. అయితే ఇంటి కోడలు చేసిన పనికి మామలకు కొత్త కష్టం వస్తుంది. అటు పూర్తిగా మారిపోయిన రాహుల్ ను మరోసారి రుద్రాణి మార్చడానికి ప్రయత్నించగా.. స్వప్న ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.

రాజ్‌తో ఆడుకున్న ఇంట్లో వాళ్లు

బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్: కావ్యకు చీర కట్టిన రాజ్.. మామయ్యలను అడ్డంగా ఇరికించిన కళావతి.. అత్తకు స్వప్న వార్నింగ్
బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్: కావ్యకు చీర కట్టిన రాజ్.. మామయ్యలను అడ్డంగా ఇరికించిన కళావతి.. అత్తకు స్వప్న వార్నింగ్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ కిచెన్ లో కావ్య కోసం రాజ్ చేసే చికెన్ మంచూరియాతో మొదలవుతుంది. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లో వాళ్లు పట్టుకుంటారు. కన్నతల్లికి తలనొప్పి ఉందంటే తల తిప్పుకొని వెళ్తావు.. నాన్నమ్మను నేను నాకు నడుము నొప్పిగా ఉందంటే పట్టించుకోవు.. ఆఫీసు పని అంటే బిజీ అంటావు..

కానీ నీ భార్యకు మాత్రం చికెన్ మంచూరియా, అది కూడా అర్ధరాత్రి చేసి పెడతావా అంటూ అపర్ణ, ఇందిరాదేవి, ప్రకాశం, ధాన్యలక్ష్మి.. రాజ్‌తో ఆడుకుంటారు. కావ్య వాళ్లను మరింత రెచ్చగొడుతుంది. వాళ్లకు దండం పెట్టి రాజ్ వెళ్లిపోయిన తర్వాత రేపు నీ సంగతి చెబుతామని వాళ్లు డిసైడవుతారు.

రాజ్‌ను కాపాడి, మామయ్యలను ఇరికించిన కావ్య

మరుసటి రోజు హాల్లోకి వచ్చిన రాజ్ తో అక్కడే ఉన్న ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్, ప్రకాశం, ధాన్యలక్ష్మి ఆడుకుంటారు. ఒకరు ఫిల్టర్ కాఫీ అని, మరొకరు అల్లం చాయ్ అని, ఇంకొకరు గ్రీన్ టీ అంటూ ఆర్డర్ ఇస్తారు. నేనెందుకు ఇవన్నీ చేయాలని రాజ్ అంటే.. నీ పెళ్లానికి చికెన్ చేశావు కదా అంటూ మరో దెప్పి పొడుస్తారు. వాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలా అని రాజ్ ఆలోచిస్తుంటే.. కావ్య వస్తుంది. వాళ్లు అడిగినవన్నీ తీసుకొచ్చి రాజ్ ను కాపాడుతుంది. వంట ఒక్కటే కాదు.. రాజ్ తన మరిన్ని కోరికలు కూడా తీర్చనున్నాడని అంటుంది.

భార్యల కోసం సుభాష్, ప్రకాశం వంట చేయాలని డిసైడవుతారు. ముందు ఉప్మ చేయాలనుకుంటారు. ఇంతకీ రవ్వతో చేస్తారా, పిండితో చేస్తారా అని సుభాష్ అడిగి.. రెండూ కలిపి చేద్దాంలే అంటాడు. ప్రకాశం పక్కనే ఉండి సుభాష్ అడిగిన ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు. సుభాష్ ఉప్మ చేస్తుంటాడు. అయితే ఉప్పు బదులు అతడు పంచదార ఇస్తాడు. అంతేకాదు పచ్చి మిర్చి బదులు కారంపొడితో సుభాష్ ఉప్మ చేస్తాడు. తర్వాత భార్యల కోసం ప్లేట్లలో పెట్టి తీసుకెళ్తారు.

అది ఎర్రటి రంగులో ఉండటం చూసి అపర్ణ షాక్ తింటుంది. కారంపొడితో చేశాం కాబట్టి అలా ఉంది.. ఏం ఫర్లేదు తినండని సుభాష్ అభయమిస్తాడు. దానిని నోట్లో పెట్టుకోగానే అపర్ణ, ధాన్యం ఇద్దరూ వాంతులు చేసుకుంటారు. ఉప్పు బదులు చక్కెర వేశారని, ఆ రంగు చూసినప్పుడే జాగ్రత్త పడాల్సిందని తమ భర్తలను తిడతారు. ఇందిరా దేవి మాత్రం తన కొడుకులపై నమ్మకం లేక తన ఉప్మ తానే చేసుకొని తినడంతో అపర్ణ, ధాన్యానికి మరింత మండుతుంది.

పూర్తిగా మారిపోయిన రాహుల్.. తల్లినీ ఎదిరించి..

మరోవైపు రాహుల్ కు తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. మరో డీల్ ఉందని ఆఫర్ ఇస్తాడు. నేరుగా ఇంటికే వచ్చేస్తాడు. రాహుల్ తాను చేయనని అంటున్నా అతడు వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. దీంతో రాహుల్ కంగారుగా బయటకు వెళ్తాడు. అది చూసిన స్వప్న కూడా అతన్ని వెంబడిస్తుంది.

బయటకు వెళ్లిన తర్వాత తన ఫ్రెండ్ ను రాహుల్ తిడతాడు. ఇలాంటి డీల్స్ తాను మానేశానని చెప్పాను కదా అంటాడు. అక్రమంగా 10 కిలోల గోల్డ్ వస్తోందని, దానిని నీ కంపెనీకి మళ్లిస్తే రూ.20 లక్షలు వస్తాయని చెప్పినా రాహుల్ మాత్రం నో చెబుతాడు. అది విని స్వప్న సంతోషించగా.. రుద్రాణి కంగారుపడుతుంది. ఏం చేస్తున్నావో నీకు తెలుసా అంటూ అతన్ని తిడుతుంది.

తాను పూర్తిగా మారిపోయానని రాహుల్ అంటున్నా.. రుద్రాణి అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అది విని స్వప్న ఆమె దగ్గరికి వచ్చి క్లాస్ పీకుతుంది. ఇన్నాళ్లూ నీమాట విని రాహుల్ పూర్తిగా పాడైపోయాడని, ఇప్పుడు మారానని అంటున్నా ఎందుకు మళ్లీ చెడగొట్టాలని చూస్తున్నావని రుద్రాణిని తిడుతుంది. తనదారికి అడ్డు రావద్దని, వస్తే బుల్డోజర్ లో తొక్కుకుంటూ వెళ్తానని స్వప్న అనడంతో రుద్రాణి కంగు తింటుంది.

మరోవైపు రాజ్ తో కావ్య తన నెక్ట్స్ కోరిక ఏంటో చెబుతుంది. బయటకు వెళ్లడానికి చీర నువ్వే కట్టాలని అంటుంది. సరే అంటూ రాజ్ చీర కడుతుండగా.. ఇద్దరూ మాంచి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe