Chiranjeevi: మొన్ననే కలిసి నవ్వుకున్నాం.. ఇప్పుడు హృద‌యం ముక్క‌లైంది.. భాగ్యరాజ్ మృతి ప‌ట్ల‌ డీప్ షాక్‌లో చిరంజీవి!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డీప్ షాక్ లో మునిగిపోయారు. రెండు రోజుల క్రితమే కలిసి నవ్వుతూ మాట్లాడిన మనిషి అకాల మరణం చెందడాన్ని ఊహించుకోలేకపోతున్నారు. కే. భాగ్యరాజ్ మృతి ప‌ట్ల‌ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఎమోషనల్ పోస్టు కన్నీళ్లు తెప్పిస్తోంది. 

Published on: Jun 27, 2026, 14:28:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi: తన విలక్షణమైన కథనాలతో, అసాధారణమైన స్క్రీన్‌ప్లే మాయాజాలంతో భారతీయ సినిమా రంగును మార్చిన సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్. ఆయన అకస్మాత్తుగా మరణించడంతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు కోలుకోలేని షాక్‌కు గురయ్యాయి. భాగ్యరాజ్ మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారానికి లోనయ్యారు. ఈ చేదు నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్తూ, తన ఆప్తమిత్రుడి మృతిపై సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తంచేశారు.

మొన్ననే కలిసి నవ్వుకున్నాం.. ఇప్పుడు హృద‌యం ముక్క‌లైంది.. భాగ్యరాజ్ మృతి ప‌ట్ల‌ డీప్ షాక్‌లో చిరంజీవి
మొన్ననే కలిసి నవ్వుకున్నాం.. ఇప్పుడు హృద‌యం ముక్క‌లైంది.. భాగ్యరాజ్ మృతి ప‌ట్ల‌ డీప్ షాక్‌లో చిరంజీవి

మొన్ననే గోవాలో సందడి

తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా చిరంజీవి ఎమోషనల్ పోస్టు పెట్టారు. "నేను తీవ్రమైన షాక్ కు గురయ్యా. నా హృదయం ముక్కలైంది, దీనిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. కేవలం మొన్ననే (రెండు రోజుల క్రితం) మేము ఇద్దరం గోవాలో జరిగిన ఖుష్బూ కూతురి వివాహ వేడుకలో కలుసుకున్నాం.

అక్కడ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, కలిసి ఫోటోలు దిగాం. భాగ్యరాజ్ ఎంతో ఉత్సాహంగా, నిండు జీవితంతో కనిపించారు. అలాంటిది ఈ రోజు ఉదయం లేచేసరికి ఆయన మరణవార్త వినాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇది ఎంతమాత్రం నమ్మశక్యంగా లేదు" అని చిరంజీవి ఎక్స్ లో పేర్కొన్నారు.

‘స్క్రీన్‌ప్లే కింగ్’ భాగ్యరాజ్

కే. భాగ్యరాజ్ కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాలేదు. 1980, 90ల కాలంలో ఆయన రాసిన కథలు, స్క్రీన్‌ప్లేలు తెలుగులో రీమేక్ అయి ఇక్కడి స్టార్ హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించాయి. ఆయన దర్శకత్వం వహించిన క్లాసిక్ ‘ముంధానై ముడిచ్చు’ తెలుగులో ‘మూడు ముళ్లు’గా, ‘ఎంగ చిన్న రాసా’ చిత్రం విక్టరీ వెంకటేశ్ హీరోగా ‘అబ్బాయిగారు’గా రీమేక్ అయి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి.

చిరంజీవితో గోల్డెన్ బాండింగ్

80ల నాటి గోల్డెన్ ఎరాలో మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో, భాగ్యరాజ్ కంటెంట్ డ్రైవెన్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఒకరికొకరు కథల విషయంలో ఎంతో గౌరవించుకునేవారు. ఇటీవల గోవా ఈవెంట్‌లో ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా గడిపిన ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆయన మరణం కమర్షియల్ సినిమా స్క్రీన్‌ప్లే రైటింగ్‌లో ఒక గొప్ప అధ్యాయానికి ముగింపు లాంటిది.

వెంకటేష్ విచారం

భాగ్యరాజ్ మరణం పట్ల మరో సీనియర్ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుందరకాండ, అబ్బాయిగారు లాంటి సినిమాల రూపంలో భాగ్యరాజ్ పనిలో భాగం కావడం అదృష్టమని వెంకటేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More