...
...
Next Story

Chiranjeevi: ఈ ఇండస్ట్రీ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను: ఇరుముడిపై చిరంజీవి పోస్ట్ వైరల్

Chiranjeevi Irumudi Review: రవితేజ ఇరుముడి మూవీకి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది. ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే.. ఈ ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు అందరిదీ అని అనడం గమనార్హం.

Published on: Aug 27, 2026, 16:21:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Chiranjeevi Irumudi Review: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'ఇరుముడి' థియేటర్లలో రూ. 120 కోట్ల గ్రాస్ సాధించి విజయవిహారం చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా పోటీలో ఉన్నప్పటికీ, కేవలం 6 రోజుల్లోనే ఈ రేంజ్ రికార్డ్ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ చూసి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది.

రవితేజ యాక్టింగ్ అద్భుతం.. ఎక్స్ వేదికగా చిరు ప్రశంసలు

Chiranjeevi: ఈ ఇండస్ట్రీ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను: ఇరుముడిపై చిరంజీవి పోస్ట్ వైరల్
Chiranjeevi: ఈ ఇండస్ట్రీ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను: ఇరుముడిపై చిరంజీవి పోస్ట్ వైరల్

సినిమా విడుదలైన మొదటి రోజే నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చిరంజీవి.. ఇప్పుడు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.

"మై డియర్ బ్రదర్ రవితేజకి 'ఇరుముడి' బ్లాక్‌బస్టర్ విజయం సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి నుంచి చివరి వరకు సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశాను. త్రినాథ్ క్యారెక్టర్‌ను రవితేజ తన భుజాలపైనే మోశారు" అని చిరు ప్రశంసల వర్షం కురిపించారు.

డైరెక్టర్ శివ నిర్వాణ టాలెంట్.. బేబీ నక్షత్రకు బ్లెస్సింగ్స్

సినిమాను ఎంతో లోతుగా, ఫుల్ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ పనితనాన్ని చిరంజీవి ప్రత్యేకంగా కొనియాడారు. గతంలో 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ.. ఈసారి రవితేజతో కలిసి పక్కా ఫ్యామిలీ, డివోషనల్ డ్రామాను ఆడియన్స్‌కు అందించారని తెలిపారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని దీవించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్రెడిబిలిటీని ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లిందని అభిప్రాయపడ్డారు.

తన పోస్ట్ ముగింపులో చిరంజీవి రాసిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సినిమా పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ, ఒకరికొకరు ఇచ్చే సపోర్ట్ గురించి చిరు ఎంతో ఉదాత్తంగా స్పందించారు.

"ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!" అంటూ చిరంజీవి మెసేజ్ ఇచ్చారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో రవితేజతో కలిసి నటించిన చిరు.. రవితేజ సాధించిన ఈ విజయాన్ని తన సొంత విజయంగా భావించి అభినందించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

రూ.200 కోట్ల క్లబ్ వైపు 'ఇరుముడి' వేగం

పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ, 'ఇరుముడి' వర్కింగ్ డేస్‌లో కూడా 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో 6 రోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

సెకండ్ వీకెండ్ కూడా ఈ సినిమాకు చాలా అనుకూలంగా ఉండటంతో, త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిపోనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe