Vishwambhara Budget: చిరంజీవి విశ్వంభర బడ్జెట్ రూ.400 కోట్లు.. ఈ మూవీ కోసం తల దించుకొని పని చేస్తున్నా: చోటా కే నాయుడు
Vishwambhara Budget: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ బడ్జెట్ రూ.400 కోట్లట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు వెల్లడించాడు. అందుకే ఈ సినిమా కోసం తాను తల దించుకొని పని చేస్తున్నట్లు చెప్పడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ మూవీ టీజర్ విడుదలైనప్పుడు, అందులోని పేలవమైన సిజిఐ (CGI) పట్ల మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.

కెమెరామ్యాన్కు సంబంధం లేదు
ఇటీవల వదలా అనే ఓ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో 'విశ్వంభర' వంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పాత్ర గురించి ఛోటా కె. నాయుడిని ప్రశ్నించారు. దీనికి అతడు సూటిగా స్పందించాడు. "అక్కడ పని చేసే డిఓపి (DOP) ఎవరనేది ముఖ్యం కాదు, సిజిఐ టెక్నీషియన్ చెప్పిందే ఫైనల్. గ్రాఫిక్స్ బాగున్నా లేకపోయినా దానికి కెమెరామెన్కు ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుని, దానికి అనుగుణంగానే మేము పని చేస్తాం" అని స్పష్టం చేశాడు.
గతంలో తాను 'అంజి', 'డమరుకం' వంటి భారీ గ్రాఫిక్స్ చిత్రాలకు పని చేసినప్పటికీ, ఈ విషయంలో తాను మేధావినని చెప్పుకోనని అతడు అన్నాడు. "ఒక్కోసారి లైటింగ్ సరిగ్గా లేకపోయినా, సిజిఐ నిపుణులు చెప్పినట్లే మేము వినాల్సి ఉంటుంది. అది తప్పని తెలిసినా మేము ఏమీ చెప్పం. ఎందుకంటే అవుట్పుట్ సరిగ్గా రాకపోతే, కెమెరామెన్ మాకు సహకరించలేదని వాళ్లు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది" అని తనలోని ఆవేదనను వెల్లడించాడు.
400 కోట్ల బడ్జెట్.. భారీ బాధ్యత
చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాను సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా చోటా కే నాయుడు వెల్లడించాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు వ్యక్తిగత అహంకారాలకు చోటు ఉండకూడదని ఛోటా పేర్కొన్నాడు. అందుకే అంజిలాంటి సినిమాకు తల ఎత్తుకొని పని చేస్తే.. విశ్వంభరకు మాత్రం తల దించుకొని పని చేస్తున్నట్లు చెప్పాడు.
"గ్రాఫిక్స్ నాణ్యత సరిగ్గా లేకపోతే చివరకు నిందలు పడేది మేమే. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ (VFX) ఎక్కువగా ఉండే సినిమాల్లో సెట్స్ మీదే ఒక ప్రత్యేక సిజిఐ టెక్నీషియన్ ఉంటారు. షూటింగ్ అంతా ఆయన మా వెంటే ఉన్నారు. సినిమా కోసం పూర్తి అంకితభావంతో పని చేశాం. ప్రేక్షకులకు అత్యుత్తమ అవుట్పుట్ అందించాలనే ఉద్దేశంతోనే మూవీ టీమ్ ఇప్పుడు సమయం తీసుకుంటోంది" అని అతడు వివరించాడు.
టీజర్ విషయంలో వచ్చిన విమర్శలను స్ఫూర్తిగా తీసుకున్న మూవీ టీమ్.. వెండితెరపై మెగాస్టార్ను అద్భుతంగా చూపించేందుకు శ్రమిస్తోంది. సోషియో-ఫాంటసీ జానర్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


