...
...
Next Story

OTT Crime Thriller: ఓటీటీలోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఖైదీ, పోలీసు మధ్య ప్రేమ బంధం.. ఐఎండీబీలో 7.6 రేటింగ్

OTT Crime Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వధ్ 2 వస్తోంది. పోలీసు, ఖైదీ మధ్య ఏర్పడే ప్రేమ బంధం చుట్టూ తిరిగే ఈ మూవీకి ఐఎండీబీలో 7.6 రేటింగ్ నమోదైంది. నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రానుంది.

Published on: Mar 25, 2026, 16:28:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది మొదట్లో థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న క్రైమ్ థ్రిల్లర్ 'వధ్ 2' ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ సినిమా.. ఫస్ట్ పార్ట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది.

వధ్ 2 ఓటీటీ వివరాలు

OTT Crime Thriller: ఓటీటీలోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఖైదీ, పోలీసు మధ్య ప్రేమ బంధం.. ఐఎండీబీలో 7.6 రేటింగ్
OTT Crime Thriller: ఓటీటీలోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఖైదీ, పోలీసు మధ్య ప్రేమ బంధం.. ఐఎండీబీలో 7.6 రేటింగ్

సినిమా పేరు: వధ్ 2

ఓటీటీ రిలీజ్ తేదీ: ఏప్రిల్ 3, 2026

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

దర్శకుడు: జస్పాల్ సింగ్ సంధు

నటీనటులు: సంజయ్ మిశ్రా, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమిత్ కే సింగ్, శిల్పా శుక్లా, యోగితా బిహానీ

బాక్సాఫీస్ నుంచి నెట్‌ఫ్లిక్స్ దాకా..

2022లో వచ్చి సూపర్ హిట్ అయిన వధ్ సినిమాకు ఇది ఒక స్పిరిచ్యువల్ సీక్వెల్. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలోకి వచ్చి డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా సిటీల్లోని మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు, అలాగే స్లో బర్న్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా భలే కనెక్ట్ అయింది. బాలీవుడ్ సినిమాలకు ఉన్న ఎనిమిది వారాల గ్యాప్ రూల్ ప్రకారమే, ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా మన ముందుకు వస్తోంది.

వధ్ 2 కథ ఏంటి?

మధ్యప్రదేశ్ లోని ఒక జైలు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నిజానికి ఇది ఫస్ట్ పార్ట్‌కు కంటిన్యూయేషన్ కాదు, ఇదొక సపరేట్ స్టోరీ. రిటైర్‌మెంట్‌కు దగ్గరపడిన శంభునాథ్ మిశ్రా (సంజయ్ మిశ్రా) అనే ఒక చిన్న స్థాయి జైలు గార్డ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను ఎవరికీ తెలియకుండా జైల్లో పండించిన కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతుంటాడు. ఆ జైల్లోనే మంజు సింగ్ (నీనా గుప్తా) అనే ఖైదీతో అతనికి మంచి స్నేహం ఏర్పడుతుంది.

ఈ వధ్ 2 సినిమాకు జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వం వహించడమే కాకుండా కథ కూడా అందించాడు. సంజయ్ మిశ్రా, నీనా గుప్తాతో పాటు కుముద్ మిశ్రా జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ సింగ్‌గా, అమిత్ కే సింగ్ ఇన్‌స్పెక్టర్‌గా తమ పాత్రలకు ప్రాణం పోశారు.

శిల్పా శుక్లా, యోగితా బిహానీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సపన్ నరుల కెమెరా వర్క్, అద్వైత్ నెమ్లేకర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలోని జైలు వాతావరణాన్ని చాలా రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్‌గా చూపించాయి.

సినిమా థీమ్.. కలెక్షన్లు..

నేరం, శిక్ష అనే కాన్సెప్ట్‌ను చాలా న్యాచురల్‌గా చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమాలో దర్శకుడు చాలా లోతుగా చూపించాడు. ఇలాంటి డిఫరెంట్ జానర్ సినిమా సుమారు రూ.4.66 కోట్లు వసూలు చేయడం నిజంగా గొప్ప విషయమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe