Dhanush OM: అడవిలో ధనుష్ ఊచకోత.. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల మూవీకి పవర్ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ ఇదే
Dhanush OM: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీలలాంటి స్టార్లు నటిస్తున్న మూవీకి ఓం: ఛాప్టర్ 1 ఉధిరమ్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ గ్లింప్స్ ను గురువారం (జూన్ 18) మేకర్స్ రిలీజ్ చేశారు.
Dhanush OM: వెర్సటైల్ యాక్టర్ ధనుష్, డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్మార్క్ మూవీ 'D55' (ధనుష్ 55వ చిత్రం) అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు మేకర్స్ ‘ఓమ్’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు.

ఈ టైటిల్తో పాటు రిలీజ్ చేసిన రెండు నిమిషాలకుపైగా నిడివి గల ఇంటెన్స్ గ్లింప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అవుట్ అండ్ అవుట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అడవిలో ధనుష్ విద్వంసం.. గ్లింప్స్ ఎలా ఉందంటే?
తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా భారీగా పెంచేసింది. ఒక దట్టమైన అడవి బ్యాక్డ్రాప్లో ఈ సీన్ మొదలవుతుంది. అక్కడ కొందరు వ్యక్తులను ఐదుగురు గన్మెన్ చుట్టుముడతారు. అలాంటి హై-టెన్షన్ పరిస్థితుల్లో ధనుష్ తన అసమానమైన పరాక్రమంతో, ఒంటిచేత్తో ఆ గన్మెన్ అందరినీ వేటాడి వేధించే యాక్షన్ సీక్వెన్స్ గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ఈ గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సాలిడ్ యాక్షన్ ఫీస్ట్ గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ సినిమా మొదటి భాగానికి ‘OM Chapter 1: Udhiram – The Blood Wood’ (ఓమ్ ఛాప్టర్ 1: ఉధిరమ్ – ది బ్లడ్ వుడ్) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ లో ధనుష్ ఓ చేతిలో గన్ను, మరో చేతిలో గొడ్డలితో చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.
ఓమ్ మూవీ క్రేజీ అప్డేట్స్
- నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల
- దర్శకుడు: రాజ్కుమార్ పెరియాసామి (అమరన్ ఫేమ్)
- బ్యానర్: గోపురం ఫిల్మ్స్ (అన్బుచెజియన్)
- సంగీతం: సాయి అభ్యంకర్
- ఛాప్టర్ 1 రిలీజ్ డేట్: అక్టోబర్ 16, 2026
ముగ్గురు సూపర్ స్టార్స్ కలయిక.. మమ్ముట్టి కీలక పాత్ర!
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని కాస్టింగ్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని ఇండస్ట్రీ టాక్.
ఇక టాలీవుడ్ సెన్సేషన్స్, క్రేజీ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ ఇందులో నటిస్తుండటం విశేషం. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్, శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ కానున్నాయి. 'అమరన్' లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ రాజ్కుమార్ పెరియాసామి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో దీనిపై భారీ బిజినెస్ అంచనాలు ఉన్నాయి.
ఓమ్.. అసలు కథేంటి? రిలీజ్ ఎప్పుడంటే?
సమాజంలో మన మధ్యే తిరుగుతూ, దేశం కోసం పోరాడే కొందరు అనామక వీరుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గోపురం ఫిల్మ్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అన్బుచెజియన్ అత్యంత భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి రీసెంట్గా మ్యూజిక్ సెన్సేషన్గా మారిన సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి భాగం 'ఓమ్ ఛాప్టర్ 1: ఉధిరమ్' దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ధనుష్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ యాక్షన్ ఓపెనర్ కానుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


