...
...
Next Story

హాస్పిటల్లో ధర్మేంద్ర.. వీడియో వైరల్.. చుట్టూ ఫ్యామిలీ.. మంచంపై కదల్లేని స్థితిలో..

ధర్మేంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంచంపై కదల్లేని స్థితిలో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పక్కనే అతని కొడుకులు, నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా ఉన్నారు. ఆ వీడియోలో ఎవరో ఏడుస్తుండటం కూడా చూడొచ్చు.

Published on: Nov 13, 2025, 17:16:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో అతని కుటుంబ సభ్యులతోపాటు హాస్పిటల్ సిబ్బంది, ఇతరులు కూడా ఉన్నారు. అయితే అందులో ఎవరో ఏడుస్తుండటం, ఆమెను సన్నీ డియోల్ ఓదార్చడం కూడా చూడొచ్చు.

హాస్పిటల్ బెడ్‌పై ధర్మేంద్ర

హాస్పిటల్లో ధర్మేంద్ర.. వీడియో వైరల్.. చుట్టూ ఫ్యామిలీ.. మంచంపై కదల్లేని స్థితిలో..
హాస్పిటల్లో ధర్మేంద్ర.. వీడియో వైరల్.. చుట్టూ ఫ్యామిలీ.. మంచంపై కదల్లేని స్థితిలో..

ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం అతడు ఇంటికి వెళ్లినా.. అసలు కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఈ వీడియోలోనూ హాస్పిటల్ బెడ్ పై అచేతనంగా పడి ఉన్న ధర్మేంద్ర చుట్టూ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం చూడొచ్చు.

అతని చిన్న కొడుకు బాబీ డియోల్ బాధగా కనిపించగా.. పెద్ద సన్నీ డియోల్ ఎవరినో ఓదారుస్తూ కనిపించాడు. వాళ్లతోపాటు ఆ రూమ్ లో ఇంకొంత మంది కూడా ఉన్నారు. ఈ వీడియోను జాలీ క్రిస్టియన్ అనే ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది.

ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు

నిజానికి నాలుగు రోజుల కిందటే ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతని కూతురు ఇషా డియోల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హేమా మాలిని కూడా కొన్ని న్యూస్ ఛానెల్స్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించింది. అతడు బాగానే ఉన్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని అతని ఫ్యామిలీ తెలిపింది. రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe