ధురంధర్ డైరెక్టర్ లవ్ స్టోరీ తెలుసా? తెలుగులోనూ నటించిన ఈ హీరోయినే అతని భార్య.. ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన నటి
ధురంధర్ మూవీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా? తెలుగులోనూ నాలుగు సినిమాల్లో నటించిన యామీ గౌతమ్నే అతడు పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఈ నటి తమ ప్రేమ విశేషాల గురించి చెప్పింది.
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ జంట చూడముచ్చటగా ఉంటుంది. అయితే వీరిద్దరి ప్రేమ కథలో ఎలాంటి సినిమాటిక్ డ్రామాలు లేవట. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదని, స్నేహం నుంచే ప్రేమ పుట్టిందని యామీ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

యామీ, ఆదిత్య ప్రేమ ఇలా పుట్టింది
నటి యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేమ కథ చాలా సింపుల్ అండ్ స్వీట్. వీరిద్దరూ ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారు అనే విషయాన్ని యామీ తాజాగా బయటపెట్టింది.
2019లో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (Uri) టైంలో వీరిద్దరూ కలిశారు. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో యామీ ఒక కీలక పాత్ర చేసింది. ఆ సమయంలోనే తాము ఎలా ప్రేమలో పడ్డామో యామీ వెల్లడించింది.
"మేం సినిమా ప్రమోషన్స్ టైంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ముందు ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాల్లో చూపించినట్టు మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ చేసుకోవడాలు, డ్రామాలు మా మధ్య జరగలేదు. అలాంటివి మా ఇద్దరికీ సెట్ కావు కూడా. మేం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం.. మా కుటుంబాలు కూడా వెంటనే ఓకే చెప్పేశాయి. అంతా చాలా సాఫీగా, సహజంగా జరిగిపోయింది" అని యామీ చెప్పింది.
భర్త ఆదిత్య ధర్ గురించి..
భర్తగా మాత్రమే కాదు.. దర్శకుడిగా కూడా ఆదిత్య అంటే తనకు చాలా గౌరవం అని యామీ తెలిపింది. "ఆయన చాలా మంచి దర్శకుడు. ఆదిత్య సెట్స్లో ఎప్పుడూ కూల్గా ఉంటారు. ఆయనకు కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. అది ఆయనలోని గొప్ప క్వాలిటీ" అని మెచ్చుకుంది. 2021 జూన్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2024లో వీరికి బాబు 'వేదవిద్' పుట్టాడు.
తాజాగా యామీ గౌతమ్ నటించిన 'హక్' (Haq) సినిమా నవంబర్ 7న విడుదలైంది. షా బానో బేగం కేసు ఆధారంగా సుపర్ణ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అటు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన రణ్వీర్ సింగ్ సినిమా 'ధురంధర్' (Dhurandhar) డిసెంబర్ 5న విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


