ఆ సినిమాను బీజేపీ పొలిటికల్ ఎజెండాతో తీశారు.. చరిత్రను సరిగా చూపించలేదు.. నేను చూడలేదు కానీ..: డైరెక్టర్ వేణు ఊడుగుల
డైరెక్టర్ వేణు ఊడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రజాకార్ మూవీని పూర్తిగా బీజేపీ పొలిటికల్ ఎజెండాతో తీశారని, చరిత్రను సరిగా చూపించలేదని విమర్శించాడు. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ హాట్ టాపిగ్గా మారాయి.
రజాకార్ మూవీ తెలుసు కదా. గతేడాది మార్చిలో రిలీజైన సినిమా ఇది. దీనిపై తాజాగా డైరెక్టర్ వేణు ఊడుగుల వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఈ మూవీని బీజేపీ తీసిందని, పూర్తిగా ఓ పొలిటికల్ ఎజెండాతో తీశారని విమర్శించాడు. గుల్టె ప్రొకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రజాకార్ చూడలేదంటూనే..
ఈ ఇంటర్వ్యూలో వేణు ఊడుగులను రజాకార్ మూవీ గురించి అడిగినప్పుడు తాను ఆ సినిమా చూడలేదంటూనే.. ఓ పొలిటికల్ ఎజెండాతో తీసిన మూవీ అని అనడం గమనార్హం.
“రజాకార్ అనే సినిమాను ఎవరు తీయించారు. బీజేపీ వాళ్లు తీసిన సినిమా. పూర్తిగా ఓ పొలిటికల్ ఎజెండాతో వచ్చింది. చరిత్ర మీద ప్రేమతోనో.. చరిత్ర మీద భాద్యతతో ఈ జనాలకు చెప్పాలనుకొని తీసిన సినిమా అది. ఓ ఫిల్మ్ మేకర్ గా ఆ డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను గౌరవిస్తా, అభినందిస్తా. కానీ వాళ్లు తీసిన కంటెంట్ మీద నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. వాస్తవానికి మూవీని తీయించింది బీజేపీయే. తెలంగాణ బీజేపీ వాళ్ల పట్ల నాకు ద్వేషమేమీ లేదు” అని వేణు ఊడుగుల అన్నాడు.
వేణు ఊడుగుల గురించి..
కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న డైరెక్టర్ వేణు ఊడుగుల విరాటపర్వం, నీది నాదీ ఒక కథ సినిమాలతో పాపులర్ అయ్యాడు. ఈ మధ్యే రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. 2011లో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాకు మాటల రచయితగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అతడు.. తర్వాత డైరెక్టర్ గా రెండు సినిమాలు తీశాడు.
రజాకార్ మూవీ గురించి..
ఇక వేణు ఊడుగుల విమర్శించిన రజాకార్ మూవీ గతేడాది మార్చిలో రిలీజైంది. యాట సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. ఇందులో బాబీ సింహా, తేజ్ సప్రు, అనసూయ, మకరంద్ దేశ్పాండే లాంటి వాళ్లు నటించారు. రజాకార్ల నుంచి ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న హిందువులు ఎదుర్కొన్న అణచివేత, దారుణాల చుట్టూ తిరిగే సినిమా ఇది. ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


