...
...
Next Story

Drishyam 3 Telugu: గుడ్ న్యూస్.. ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన దృశ్యం 3.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Drishyam 3 Telugu: మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ దృశ్యం 3 ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు స్టే కారణంగా మిగిలిన భాషలతో కలిసి స్ట్రీమింగ్ ప్రారంభం కాకపోయినా.. శుక్రవారం (జూన్ 19) నుంచి తెలుగు వెర్షన్ కూడా రావడం విశేషం.

Published on: Jun 19, 2026 09:34 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Drishyam 3 Telugu: దృశ్యం 3 మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. మద్రాస్ హైకోర్టు స్టే కొనసాగుతున్న ప్రస్తుతం మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.

తెలుగులో దృశ్యం 3 స్ట్రీమింగ్

Drishyam 3 Telugu: గుడ్ న్యూస్.. ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన దృశ్యం 3.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
Drishyam 3 Telugu: గుడ్ న్యూస్.. ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన దృశ్యం 3.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్‌లాల్, మీనా నటించిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ దృశ్యం 3. గత నెలలో థియేటర్లలో రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది. గతంలో వచ్చిన రెండు మూవీస్ తో పోలిస్తే.. మూడో భాగానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాగానే వసూలు చేసింది.

ఇక ఈ సినిమా గురువారం (జూన్ 18) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మద్రాస్ హైకోర్టు స్టే కారణంగా తెలుగు వెర్షన్ మినహాయించి ఒరిజినల్ మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ మరుసటి రోజే తెలుగు వెర్షన్ ను కూడా ప్రైమ్ వీడియో యాడ్ చేయడం విశేషం. ఆడియోలో తెలుగును కూడా చేర్చడం చూడొచ్చు.

అసలు ఏం జరిగింది?

'దృశ్యం' మొదటి భాగాన్ని తెలుగులో వెంకటేష్, మీనా లీడ్ రోల్స్ లో డైరెక్టర్ శ్రీప్రియ (Sripriya) రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'దృశ్యం 3' తెలుగు హక్కులు తమకే చెందుతాయంటూ శ్రీప్రియ, ఆమె నిర్మాణ సంస్థ 'రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్' మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కే కుమారేష్ బాబు కీలకమైన మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు ముందే ప్రైవేట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి తరపున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి నోట్ చేశారు.

"ప్రతివాదులకు నోటీసులు అందినప్పటికీ వారి తరపున ఎవరూ కోర్టుకు రాలేదు, కాజ్ లిస్ట్ లో కూడా వారి పేర్లు ప్రింట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ కాపీరైట్ హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే రెస్పాండెంట్స్, వారి సిబ్బంది లేదా అసైనీలు ఎవరూ కూడా 'దృశ్యం 3' సినిమాను తెలుగు వెర్షన్ లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం" అని కోర్టు స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe