...
...
Next Story

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా.. ఓనం రేసు నుంచి తప్పుకొని సోలో ప్లాన్.. రిలీజ్ ఎప్పుడంటే?

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ నటించిన ఐ యామ్ గేమ్ మూవీ రిలీజ్ ఊహించినట్లుగానే వాయిదా పడింది. ఓనం పండుగకు రావాల్సి ఉన్న ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా పడింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Published on: Aug 13, 2026, 13:44:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Dulquer Salmaan: తెలుగు సినిమా లవర్స్ మనసులు గెలుచుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్' (I'm Game) థియేట్రికల్ రిలీజ్ డేట్ సడన్ గా మారింది. ముందే అనుకున్నట్టు ఆగస్టు 20న రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడింది. సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఓనం రేస్ నుంచి అవుట్.. అసలు రీజన్ ఏంటి?

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా.. ఓనం రేసు నుంచి తప్పుకొని సోలో ప్లాన్.. రిలీజ్ ఎప్పుడంటే?
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా.. ఓనం రేసు నుంచి తప్పుకొని సోలో ప్లాన్.. రిలీజ్ ఎప్పుడంటే?

వాస్తవానికి ఈ సినిమాను కేరళలో ఎంతో ఘనంగా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 20న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే ఆ రోజున రిలీజ్ చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో సరైన థియేటర్లు దొరకవని ప్రొడక్షన్ టీమ్ భావించింది.

పాన్ ఇండియా వైడ్ గా మూవీని భారీగా ప్రమోట్ చేయడానికి, తెలుగు సహా వివిధ భాషల్లో బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, సినిమా రేంజ్ పెంచడానికే ఈ సమయం ఉపయోగపడుతుందని టీమ్ వెల్లడించింది.

5 భాషల్లో గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్

దుల్కర్ సల్మాన్‌కు కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా విపరీతమైన మార్కెట్ ఉంది. 'సీతారామం', 'లక్కీ భాస్కర్' సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు ఆయన బాగా దగ్గరయ్యారు.

అందుకే 'ఐ యామ్ గేమ్' సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ "ది గేమ్ గెట్స్ బిగ్గర్.. ది రిలీజ్ గెట్స్ వైడర్" అంటూ ప్రొడక్షన్ హౌస్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

'ఆర్డీఎక్స్' డైరెక్టర్ తో పవర్ ఫుల్ కాంబినేషన్

ఈ సినిమాలో దుల్కర్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కథిర్, సంయుక్త విశ్వనాథన్ వంటి పవర్ ఫుల్ స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ 'మళవిల్లాయే' సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

బాక్సాఫీస్ టార్గెట్.. దుల్కర్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 3న సోలోగా రావడంతో పాటు గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మంచి స్కోప్ దొరుకుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అదనంగా దొరికిన రెండు వారాల సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు, ప్రమోషన్లకు గట్టిగా వాడుకోనున్నారు. సెప్టెంబర్ ఆరంభంలో థియేటర్లకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఐ యామ్ గేమ్ విశేషాలు

సినిమా పేరు: ఐ యామ్ గేమ్ (I'm Game)

హీరో: దుల్కర్ సల్మాన్

డైరెక్టర్: నహాస్ హిదాయత్ (RDX ఫేమ్)

నటీనటులు: కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కథిర్, సంయుక్త విశ్వనాథన్

సంగీతం: జేక్స్ బిజోయ్

పాత రిలీజ్ డేట్: ఆగస్టు 20, 2026

కొత్త రిలీజ్ డేట్: సెప్టెంబర్ 3, 2026

భాషలు: మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe