ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న ఫారియా అబ్దుల్లా డార్క్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.6 రేటింగ్..

ఓటీటీలోకి ఫారియా అబ్దుల్లా నటించిన డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. గతేడాది డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

Published on: Jan 8, 2026, 21:40:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫారియా అబ్దుల్లా నటించిన డార్క్ కామెడీ మూవీ గుర్రం పాపిరెడ్డి. ఐఎండీబీలో 9.6 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే కనుమ రోజు నుంచి ఈ మూవీని చూడొచ్చు.

ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న ఫారియా అబ్దుల్లా డార్క్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.6 రేటింగ్..
ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న ఫారియా అబ్దుల్లా డార్క్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.6 రేటింగ్..

గుర్రం పాపిరెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్

ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్లో నటించిన గుర్రం పాపిరెడ్డి మూవీ గతేడాది డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించని ఈ సినిమా ఇప్పుడు జనవరి 16న డిజిటల్ ప్రీమియర్ కానుంది. “జర భద్రం.. ఇది అంతా మోసం.. గుర్రం పాపిరెడ్డి వస్తున్నాడు తెలుగు జీ5కి.. జనవరి 16న ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో జీ5 ట్వీట్ చేసింది.

గుర్రం పాపిరెడ్డి మూవీ స్టోరీ ఏంటంటే?

నరేష్ అగస్త్య, ఫారియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో నటించారు. మురళీ మనోహర్ సినిమాను డైరెక్ట్ చేశాడు.

ఇందులో గుర్రం పాపిరెడ్డి అనే టైటిల్ పాత్రలో నరేష్ అగస్త్య నటించాడు. ఇక మెంటల్ హాస్పిటల్లో నర్సుగా పని చేసే సౌదామిని పాత్రలో ఫారియా నటించింది. ఈ ఇద్దరూ కలిసి కోట్లు రాబట్టే స్కెచ్ వేస్తారు. దీనికోసం ఓ శవాన్ని మార్చే పనికి పూనుకుంటారు. అసలు దీని వెనుక కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

ఈ గుర్రం పాపిరెడ్డి చాలా యూనిక్, డిఫరెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర అంతగా వసూళ్లు రాలేదు. అయితే ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడీ గుర్రం పాపిరెడ్డికి కూడా జీ5 ఓటీటీలో అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More