OTT Thriller: ఈ డిజాస్టర్ సినిమాకు ఓటీటీలో రూ.349 రెంట్.. షాకవుతున్న ప్రేక్షకులు.. దేశాన్ని కాపాడిన ఆర్బీఐ గవర్నర్ కథ

OTT Today: ఓటీటీలోకి ఈరోజు ఓ ఫైనాన్షియల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా పేరు గవర్నర్: ది సైలెంట్ సేవియర్. మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయినా కూడా ప్రైమ్ వీడియోలో మాత్రం భారీ రెంట్ కు అందుబాటులోకి వచ్చింది.

Published on: Jul 24, 2026, 13:24:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Thriller: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) లీడ్ రోల్‌లో నటించిన సీరియస్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ థ్రిల్లర్ 'గవర్నర్: ది సైలెంట్ సేవియర్' (Governor: The Silent Saviour) సైలెంట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. జూన్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. రూ.25 కోట్ల బడ్జెట్ కు కేవలం రూ.7 కోట్ల వసూళ్లే వచ్చినా.. మనోజ్ బాజ్‌పాయ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.

OTT Thriller: ఈ డిజాస్టర్ సినిమాకు ఓటీటీలో రూ.349 రెంట్.. షాకవుతున్న ప్రేక్షకులు.. దేశాన్ని కాపాడిన ఆర్బీఐ గవర్నర్ కథ
OTT Thriller: ఈ డిజాస్టర్ సినిమాకు ఓటీటీలో రూ.349 రెంట్.. షాకవుతున్న ప్రేక్షకులు.. దేశాన్ని కాపాడిన ఆర్బీఐ గవర్నర్ కథ

భారీ రెంట్ షాకిచ్చిన ప్రైమ్ వీడియో

తాజాగా ఈ గవర్నర్ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ను ప్రారంభించింది. అయితే ఈ సినిమాను చూడటానికి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే మాత్రం సరిపోదు.

ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నా సరే ఈ సినిమాను చూడాలంటే ప్రేక్షకులు ప్రత్యేకంగా రూ. 349 చెల్లించి రెంట్ ప్రాతిపదికన మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఓ డిజాస్టర్ సినిమాకు ఇంత భారీ మొత్తం రెంట్ నిర్ణయించడం ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తోంది.

1991 భారత్ ఆర్థిక సంక్షోభం.. వెన్నులో వణుకు పుట్టించే నిజాలు

గవర్నర్ సినిమా కథ మొత్తం 1991 నాటి భారత ఆర్థిక సంక్షోభం చుట్టూ తిరుగుతుంది. దేశం ఆర్థికంగా దివాళా తీసే దారుణమైన పరిస్థితికి చేరుకున్నప్పుడు.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఒక సాధారణ వ్యక్తి తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఈ సినిమాకు ప్రధానమైన పాయింట్.

ఎలాంటి కమర్షియల్ హంగులు, అనవసరమైన యాక్షన్ సీన్లు లేకుండా పక్కా వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ కథను తెరకెక్కించారు. దేశాన్ని ఆర్థిక విపత్తు నుంచి కాపాడేందుకు ఆ ఆర్‌బీఐ గవర్నర్ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని ఎలాంటి సంస్కరణలు తెచ్చారో చాలా ప్రాక్టికల్‌గా చూపించారు.

మనోజ్ బాజ్‌పాయ్ వన్ మ్యాన్ షో

'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్, ‘జోరమ్’ లాంటి సినిమాలతో ఓటీటీ స్పేస్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న మనోజ్ బాజ్‌పాయ్, ఈ సినిమాలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఒదిగిపోయారు. పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, కళ్లలోనే ఇంటెన్స్ ఎమోషన్స్ చూపిస్తూ సినిమాను తన భుజాలపై నడిపించారు.

ఈ చిత్రంలో 'ది కేరళ స్టోరీ' ఫేమ్ అదా శర్మ, సీనియర్ నటి మధూ, నౌషాద్ మహమ్మద్ కుంజు కీలక పాత్రల్లో కనిపించారు. వర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ చిన్మయ్ డి. మాండ్లేకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రసిద్ధ నిర్మాత విపుల్ అమృత‌లాల్ షా ప్రొడ్యూస్ చేశారు.

అమిత్ త్రివేది మ్యూజిక్.. ప్రైమ్‌లో రెంట్ వివాదం

పాపులర్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేది అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పొలిటికల్ డ్రామాకు తగ్గట్లుగా చాలా గ్రిప్పింగ్‌గా కుదిరింది. సీరియస్ ఎలివేషన్స్, ఎకనామిక్ క్రైసిస్ సీన్లలో రీ-రికార్డింగ్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.

అయితే థియేట్రికల్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, రూ. 349 రెంట్ మోడల్ (Pay-Per-View) పెట్టడంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఫైనాన్షియల్ థ్రిల్లర్ సినిమాలను సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో నేరుగా ఇస్తే ఎక్కువ మంది డిజిటల్ ఆడియన్స్‌కు రీచ్ అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే సీరియస్, కంటెంట్ డ్రివెన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More