Gunde Ninda Gudi Gantalu Today Episode: నీతూకి రవి హగ్.. శృతితో తెగదెంపులు.. బయటపడిన రోహిణి దొంగతనం.. డేంజర్లో పడిన మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 8 ఎపిసోడ్ లో రోహిణి దొంగతనం బయటపడే పరిస్థితి ఓ చీర వల్ల వస్తుంది. అయితే ఇది పరోక్షంగా మీనాను డేంజర్లో పడేసేలా అనిపిస్తుంది. అటు నీతూతో అడ్డంగా దొరికిపోయి శృతితో రవి తెగదెంపుల వరకూ వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది.

Published on: Apr 8, 2026, 07:42:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో శృతికి అడ్డంగా దొరికిపోతాడు రవి. నీతూని హగ్ చేసుకుండగా చూడటంతో తెగదెంపుల వరకూ వెళ్తుంది. అటు మనోజ్ మరోసారి అడ్డంగా బుక్కవడంతో తనతోపాటు తల్లి ప్రభావతినీ ఇరికిస్తాడు. మరోవైపు రోహిణి దొంగతనం బయటపడే సిచువేషన్ వస్తుంది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: నీతూకి రవి హగ్.. శృతితో తెగదెంపులు.. బయటపడిన రోహిణి దొంగతనం.. డేంజర్లో పడిన మీనా
Gunde Ninda Gudi Gantalu Today Episode: నీతూకి రవి హగ్.. శృతితో తెగదెంపులు.. బయటపడిన రోహిణి దొంగతనం.. డేంజర్లో పడిన మీనా

మనోజ్‌ను చితకబాదిన బాలు, రవి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఏప్రిల్ 8) ఎపిసోడ్ మనోజ్ ను ఇంట్లో వాళ్లు యాడ్ షూట్ డబ్బుల కోసం నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ముంబై ముకేష్ డబ్బు ఇచ్చినట్లు ఎందుకు చెప్పలేదని బాలు నిలదీస్తాడు. పూర్తయ్యాక చెబుదామనకున్నా అని అనడంతో అవి కూడా మింగేద్దామనుకున్నావా అని బాలు అతన్ని చితకబాదుతాడు. ఈసారి రవి కూడా అతనికి తోడవుతాడు. ఇద్దరూ అతన్ని వెంట పడి మరీ కొడతారు. ఒక దశలో మనోజ్ మీదికి టీపాయ్ తో దాడికి కూడా రవి సిద్దమవుతాడు.

నిజం ఒప్పుకున్న మనోజ్.. సత్యం, ప్రభావతి కూడా..

అటు సత్యం, ప్రభావతి కూడా మనోజ్ ను నిలదీస్తారు. దీంతో మనోజ్ నిజం ఒప్పుకుంటాడు. ఒక్కొక్కరికి పాతిక వేలు ఇచ్చాడని చెబుతాడు. మరి ముందే ఎందుకు నిజం చెప్పలేదని సత్యం అడుగుతాడు. మళ్లీ పూర్తయ్యాక చెబుదామనుకున్నా అని మనోజ్ అనడంతో సత్యం అతన్ని కొడతాడు. అటు ప్రభావతి కూడా కొడుతుంది. ఎవరి డబ్బులు వారికి ఇచ్చేయమని సత్యం అంటాడు.

అందరికీ డబ్బులు ఇచ్చిన మనోజ్.. దొరికిపోయిన ప్రభావతి

దీంతో చేసేది లేక అందరి డబ్బులనూ వాళ్ల అకౌంట్లలో వేస్తాడు మనోజ్. అమ్మకు ఇవ్వవా అని రవి అడిగితే.. తర్వాత ఇస్తానంటాడు. కుదరదు ఇప్పుడే ఇవ్వాలంటే నీకు రూ.15 వేలే ఇస్తానని మనోజ్ అంటాడు. ఎందుకని అడిగితే.. ఇంతకుముందే రూ.10 వేలు ఇచ్చానని చెబుతాడు. దీంతో ప్రభావతి గుట్టు కూడా బయటపడుతుంది. దీంతో బాలు, రవి, మీనా, శృతి వాళ్లను అసహ్యించుకుంటారు. ఆ విషయంలో కూడా మనోజ్ ను ప్రభావతి కొడుతుంది.

రవికి నీతూ ఫోన్.. బాయ్‌ఫ్రెండ్‌గా నటించాలని రిక్వెస్ట్

అటు లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న రవికి నీతూ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది. తన ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకుంటున్నారని, తనకు ఇష్టం లేదని చెబుతుంది. అమెరికా నుంచి ఓ వ్యక్తి వచ్చాడని, అతని ముందు తన బాయ్‌ఫ్రెండ్ గా నటిస్తే ఆ పెళ్లి చెడిపోతుందని నీతూ అంటుంది. దీనికి మొదట రవి ఒప్పుకోడు. నీతూ అతన్ని బతిమాలుతుంది. సరే అంటూ.. శృతికి చెప్పి చేస్తానంటాడు. ఆమెకు చెబితే ఒప్పుకోదు అని నీతూ అనడంతో సరే చెప్పకుండానే వస్తాలే అని రవి అంటాడు.

బాలు ఈఎంఐ కట్టిన మీనా, సత్యం

ఇటు బాలు కారు ఈఎంఐ కట్టడానికి వస్తాడు. అప్పటికే మీనా ఆ ఈఎంఐ కట్టేస్తుంది. మనోజ్ ఇచ్చిన డబ్బుతో కట్టానని చెబుతుంది. ఇద్దరిలో ఎవరు కడితే ఏంటిలే అని ఆమె అంటుంది. ఆ తర్వాత సత్యం కూడా అక్కడికి వస్తాడు. బాలుకి తెలియకుండా ఈఎంఐ కట్టాలనుకున్నా అతన్ని ముందే బాలు, మీనా చూస్తారు. తాను కూడా బాలు ఈఎంఐ కట్టడానికి వచ్చానని అనడంతో మీనా కట్టేసిందని బాలు చెబుతాడు. దీంతో మరుసటి నెల ఈఎంఐ కడతానని సత్యం లోనికి వెళ్తాడు.

రవి, నీతూలను చూసేసిన శృతి

నీతూని కలవడానికి స్టైలిష్ గా రెడీ అవుతాడు రవి. అది చూసి శృతి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. ముఖ్యమైన మీటింగ్ ఉందంటూ రవి అబద్ధం చెబుతాడు. హడావిడిగా వెళ్లిపోతాడు. అయితే అతడు కోటు మరచిపోవడంతో ఇవ్వడానికి అతని వెంటే వెళ్తుంది శృతి.

ఇటు రెస్టారెంట్ లో అమెరికా నుంచి వ్యక్తికి రవిని తన బాయ్‌ఫ్రెండ్ గా పరిచయం చేస్తుంది నీతూ. రవి కూడా రెండేళ్లుగా తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లు చెబుతాడు. ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు. అది శృతి చూస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత రవిని నీతూ హగ్ చేసుకొని థ్యాంక్స్ చెబుతుంది.

రవిని మరింత ఇరికించిన నీతూ

అది చూసిన శృతికి మరింత మండుతుంది. శృతి అక్కడ ఉండటం చూసి రవి షాక్ తింటాడు. కోపంతో వెళ్లిపోతున్న ఆమె వెంట వెళ్లి ఇదంతా నాటకం అని చెబుతాడు. అయినా శృతి నమ్మదు. నీతూతో నిజం చెప్పిద్దామనుకుంటాడు. కానీ నీతూ మాత్రం రవిని ఆట పట్టించాలనుకొని మన లవ్ విషయమా అంటూ శృతి ముందు మరింత డ్రామా ఆడుతుంది. దీంతో ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇంటికి రా నీ సంగతి చెబుతా అంటూ కోపంగా వెళ్లిపోతుంది శృతి.

రోహిణి దొంగతనం బయటపడుతుందా?

ఇటు కామాక్షి ఇంటికి వస్తుంది ప్రభావతి. ఆ తర్వాత మీనా కూడా పూలు తీసుకొని అక్కడికి వస్తుంది. వాళ్లకు కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంది మీనా. ఇంతలో ప్రభావతి స్టూడెంట్ తన తల్లిని తీసుకొస్తుంది. ఆమె ప్రభావతిని పరిచయం చేసుకొని తాను చీరల బిజినెస్ చేస్తానంటూ వెంట తీసుకొచ్చిన చీరలను చూపిస్తుంది. అందులో ఒకటి ప్రభావతికి బాగా నచ్చుతుంది. దాని ఖరీదు రూ.45 వేలు అని చెప్పడంతో ప్రభావతి షాక్ తింటుంది.

అయితే కామాక్షి ఇంట్లోనే ఉన్న తన రూ.2 లక్షలతో ప్రభావతి ఆ చీర కొనడానికి రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది రోహిణి దొంగతనాన్ని బయటపెడుతుందా? ఆ సమయంలో వంటింట్లోనే ఉన్న మీనాను ఇది డేంజర్లో పడేస్తుందా అన్న అనుమానం కలిగిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More