గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ క్రైమ్ కథ- రోహిణిని ఇటుకతో కొట్టబోయిన ప్రభావతి- లక్ష అడ్వాన్సుతో అద్దె ఇల్లు

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌లో కామాక్షి చేసిన వంట ప్రయోగం బెడిసికొట్టడంతో ప్రభావతి అవస్థలు పడిందని తెలుస్తుంది. మనోజ్ తనకు వచ్చిన లెటర్ గురించి ప్రభావతికి చెబుతాడు. ఇంతలో రోహిణి పైకి వస్తే ఇటుకతో కొట్టబోతుంది ప్రభావతి. 20 వేల అద్దె, లక్ష అడ్వాన్సుతో రెంట్‌కు ఇల్లు చూస్తుంది రోహిణి.

Published on: Feb 06, 2026 8:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వండిన బిర్యానీ తిని ప్రభావతి అవస్థలు పడుతుంది. మీనాను రోహిణి అంటుంది. మీనా కౌంటర్ వేస్తుంది. మీనా చేసిన బిర్యానీ తన పుట్టింట్లో ఇచ్చి, బయట కొని ఉంటుందని ప్రభావతి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌

ఊరు గొప్ప పేరు దిబ్బ

వాళ్లేమైనా గతి లేనివాళ్లా అని మీనా అంటే.. ఈ పార్లరమ్మలా ఒకరు జైలులో, మరొకరు పైలోకంలో ఉన్నారా. ఊరు గొప్ప పేరు దిబ్బ అని బాలు అంటాడు. కావాలంటే హోటల్ బిల్ చూడమంటుంది ప్రభావతి. ఆ బిల్ చూసిన బాలు డేట్ చూడమంటాడు. డిసెంబర్ 31 నాటి బిల్ అని సత్యం చూసి చెబుతాడు.

నా పుట్టింటిని అనడమేనా అని అత్త ప్రభావతిని అంటుంది మీనా. ఇంతలో సత్యంకు రంగ కాల్ చేసి చెల్లెమ్మకు ఎలా ఉందని అడుగుతాడు. సత్యం చెబుతాడు. అదంతా మా కామాక్షి వల్ల. అదేదో లంబ లంబా అనే వంట ప్రయోగం చేసి పచ్చ కర్పూరంకు బదులు హారతి కర్పూరం వేసిందట. ఇప్పుడే కడుపు వాష్ చేసి సిలెన్ పెట్టారు. హాస్పిటల్‌లో ఉన్నామని అని రంగ చెబుతాడు.

దాంతో రోహిణి జారుకుంటే ఎక్కడికి అని మీనా నిలదీస్తుంది. అంతా ప్రభావతిని అనేసి వెళ్లిపోతారు. అలా కామాక్షి వంట ప్రయోగం బెడిసి కొడుతుంది. లెటర్‌లో రాసింది మనోజ్‌ కలలో అనుకుంటాడు. లేచి మళ్లీ ఆ లెటర్ చదువుతాడు. వెళ్లి లెటర్ గురించి ప్రభావతికి చెబుతాడు. ఆ లెటర్ చదివిని ప్రభావతి షాక్ అవుతుంది. నాకు గుండెపోటు ఏంట్రా అని ప్రభావతి అంటుంది.

మనోజ్ క్రైమ్ కథ

నీకు గుండెపోటు వస్తుంది. ఎవరైనా ఖాళీగా ఉంటే బతికిపోతావ్. ఆ దొంగ రోహిణిని మెడపై నుంచి తోసేస్తాడు. రోహిణి చస్తాడు. ఆ దొంగను బాలు గాడు చంపేస్తాడు. అప్పుడు నాన్న వాడు జైలుకు వెళ్తారు. ఆ బాధలో నేను ఆత్మహత్య చేసుకుంటాను ఓ క్రైమ్ కథ చెబుతాడు మనోజ్. ఇంటిల్లిపాదిని తుడిచిపెట్టేశావ్ కదరా. ఈ చావు గోల ఏంట్రా అని ప్రభావతి అంటుంది.

ఇంతకీ ఎవడ్రా వాడు అని ప్రభావతి అంటే.. వాడ దొంగ అట అని మనోజ్ అంటాడు. ఇంతలో ఏదో చప్పుడు అయితే ఆ దొంగ వచ్చినట్లున్నాడు అని మనోజ్ భయపడుతాడు. పక్కన ఉన్న ఇటుక తీసుకుని ప్రభావతి, మనోజ్ దాక్కుంటారు. కానీ, రోహిణి వస్తుంది. రోహిణిని కొట్టేందుకు ఇటుక ఎత్తుతుంది ప్రభావతి. అత్తయ్య అనేసరికి ఇటుక దించేస్తుంది ప్రభావతి.

ఎవరిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని రోహిణి అంటుంది. దాంతో లెటర్ కథ చెబుతాడు మనోజ్. ఆ లెటర్ చదివిన రోహిణి దీనికా భయపడేది. ఎవరో ఆటపట్టిస్తున్నాడు అని రోహిణి అంటుంది. వాడు దొంగట. అప్పుడప్పుడు జైలుకు వెళ్తాడట అని మనోజ్ అంటే.. కొంపదీసి దినేష్ గాడా అని రోహిణి డౌట్ పడుతుంది.

ఉలిక్కిపడిన బాలు

పోలీసులకు కంప్లైంట్ ఇద్దామంటే రోహిణి వద్దంటుంది. సెక్యూరిటీని పెడదామంటుంది. మరోవైపు నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడు బాలు. మీనా నీళ్లు ఇస్తుంది. ఇద్దరం గొడవ పడినట్లు కల వచ్చిందని బాలు అంటాడు. తప్పు మీరే చేసి ఉంటారని మీనా అంటుంది. ఇద్దరు వాదించుకుంటారు. పీడకల నిజమయ్యేట్లు ఉందని మీనా చెప్పడంతో బాలు సైలెంట్ అవుతాడు.

ఇప్పుడే ఈ కల వచ్చింది. మా బామ్మ ఉంటే దిష్టి తీసేదని బాలు అంటాడు. దాంతో మీనానే బాలుకు అర్ధరాత్రి దిష్టి తీస్తుంది. తర్వాత ఇద్దరు పడుకుంటారు. మీనాపై కాలు వేస్తాడు బాలు. తర్వాత చేయి వేస్తాడు. మీనా వారించడంతో బాలు అటువైపు ముడుచుకుని పడుకుంటాడు. మీనా బుజ్జగిస్తుంది. మరోవైపు అద్దె ఇల్లు కోసం రోహిణి, విద్య ఓ ఇంట్లోకి వెళ్తారు.

రోహిణి, విద్య వాళ్లు అడిగే ప్రశ్నలకు ఇంటి యజమాని పంచ్‌లు వేస్తాడు. అమ్మా, కొడుకు నేను ఉంటామని, భర్త దుబాయ్‌లో ఉంటాడని రోహిణి చెబుతుంది. అయితే ఇల్లు ఇవ్వనని, ఇదివరకు దుబాయ్‌లో మొగుడు ఉంటాడని చెప్పి ఒకావిడ దిగింది. తర్వాత మొగుడు వచ్చి కొట్టాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాలనీ వాళ్లంతా నన్ను పచ్చడి చేశారు అని ఇంటి యజమాని అంటాడు.

లక్ష అడ్వాన్స్‌తో ఇంటి అద్దె

నాకు అబద్ధం చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు నచ్చరు అని ఇంటి ఓనర్ అంటాడు. ఇది ఇప్పటికీ అబద్ధం చెప్పలేదు. మోసం అంటేనే తెలియదు అని విద్య అంటుంది. దాంతో ఇల్లు చూపిస్తాడు ఓనర్. కానీ, అద్దె 20 వేలు, అడ్వాన్స్ లక్ష అని చెబుతాడు. సరే రెండు రోజుల్లో ఇస్తానని టోకెన్ అడ్వాన్ ఇస్తుంది రోహిణి. మూడో రోజు వస్తే ఈ టోకెన్ అడ్వాన్స్ కూడా ఇవ్వను అని ఇంటి ఓనర్ అంటాడు.

దాంతో రోహిణి, విద్య వాళ్లు వెళ్లిపోతారు. లక్ష గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు రాజేష్ పడిపోయి ఉంటే.. తాగి ఉన్నాడని ఫ్రెండ్స్ అంటాడు. ఈ బతుకులు మారవురా అని రాజేష్ మైకంలో అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.