Hanuman Ansh Telugu: కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర రూ. 153 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన బాలీవుడ్ డివైన్ బ్లాక్బస్టర్ 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. ఈ అసాధారణమైన డివోషనల్ సినిమాను టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో సెప్టెంబర్ 18న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కొలిచే ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రేంజ్లో వసూళ్ల సునామీ సృష్టించింది. ట్రేడ్ పండితులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తూ వారం వారం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.
రంగంలోకి దిగిన త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
ఉత్తరాదిన సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఆయన సతీమణి సాయి సౌజన్య నేతృత్వంలోని 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' బ్యానర్పై ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ రూపొందించారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించిన వార్తలు రాగా, తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా మోషన్ పోస్టర్ షేర్ చేస్తూ సెప్టెంబర్ 18న రిలీజ్ ఖరారు చేసినట్లు ప్రకటించింది. త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్ తోడవ్వడంతో తెలుగు చిత్రసీమలో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.
నీమ్ కరోలి బాబా డివైన్ జర్నీ.. అసలు కథేంటంటే?
కైంచీ ధామ్ (ఉత్తరాఖండ్) కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నీమ్ కరోలి బాబా జీవితంలోని కీలక ఘట్టాలు, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, జూలియా రాబర్ట్స్ లాంటి గ్లోబల్ సెలబ్రిటీలు సైతం పూజించే ఈ ఆధ్యాత్మిక గురువు జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు.
{{/usCountry}}కైంచీ ధామ్ (ఉత్తరాఖండ్) కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నీమ్ కరోలి బాబా జీవితంలోని కీలక ఘట్టాలు, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, జూలియా రాబర్ట్స్ లాంటి గ్లోబల్ సెలబ్రిటీలు సైతం పూజించే ఈ ఆధ్యాత్మిక గురువు జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు.
{{/usCountry}}లక్ష్మీ నారాయణ్ శర్మ అనే చిన్న కుర్రాడు హనుమంతుడిపై ఉన్న అపారమైన భక్తితో దైవాన్ని వెతుక్కుంటూ వెళ్లి నీమ్ కరోలి బాబాగా ఎలా మారాడు అనేది దర్శకుడు విశాల్ చతుర్వేది గుండెలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. ఈ సినిమాలో శోభినావ్ సత్య ప్రధాన పాత్రలో జీవించగా, చందన్ ఆనంద్, నిఖిల్ దూబే, ఉదయ్సింహ రాజ్పుత్, పూర్ణిమ తివారి కీలక పాత్రల్లో మెరిసారు.
2 కోట్ల బడ్జెట్.. 150 కోట్లకు పైగా వసూళ్లు
స్వయంభూ మీడియా నెట్వర్క్ నిర్మించిన ఈ చిత్రం ఎటువంటి అట్టహాసాలు, పెద్ద నటీనటులు లేకుండా కేవలం బలమైన కంటెంట్, భక్తిరస భావనలతో థియేటర్లలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. రోజురోజుకూ కేవలం మౌత్ టాక్ ద్వారా పెరిగి థియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతూ వెళ్లడం విశేషం.
విశాల్ చతుర్వేది రాసిన 'డివైన్ డిటూర్' పుస్తకం ఆధారంగా మూడు భాగాల ట్రైలజీగా రానున్న ఈ ఫ్రాంచైజీలో 'హనుమాన్ అంశ' మొదటి భాగంగా ప్రేక్షకులను అలరిస్తోంది. సెప్టెంబర్ 18న తెలుగులో విడుదలవుతున్న ఈ సినిమా ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.