వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న రవితేజ ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం (జనవరి 10) రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. రవితేజ, పవన్ కల్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
హరీష్ శంకర్ కామెంట్లు

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ‘‘సినిమా ఆడిందా, ఓడిందా అనేది పట్టించుకోడు. తెల్లారి షూటింగ్ కు వస్తాడు. భగవద్గీతలో చెప్పినదాన్ని అర్థమయ్యేలా చెప్తా. బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఫ్లాఫ్ వచ్చినప్పుడు కుంగిపోవద్దు. మరి ఆయన (రవితేజ) భగవద్గీత చదువుకున్నారో లేదో నాకు తెలియదు. దీన్ని స్థితప్రజ్ఞత అంటారు’’ అని హరీష్ శంకర్ తెలిపాడు.
ఈ క్వాలిటీ
‘‘స్థితప్రజ్ఞత క్వాలిటీని ఇద్దరిలో చూశా. పవన్ కల్యాణ్ లో చూశా. సేమ్ క్వాలిటీ రవితేజలో చూశా. ఏ ముహూర్తాన ఈ క్వాలిటీ అలవర్చుకున్నారో కానీ మాలాంటి వాళ్లందరికీ నేర్పించారు. అందుకే మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా’’ అని హరీష్ శంకర్ చెప్పాడు. గతంలో రవితేజ, పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ సినిమాలు తీశాడు.
ఆ టైటిల్ నాది
ఇక రవితేజ మాస్ మహరాజ్ టైటిల్ తనదేనని హరీష్ శంకర్ అన్నాడు. ‘‘ఆయన మాస్ మహరాజ్ తీసేయండని అన్నారని సోషల్ మీడియాలో వచ్చింది. మాస్ మహరాజ్ టైటిల్ పెట్టింది నేను. పేటెంట్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఉంచాలన్నా, తీసేయాలన్నా ఫస్ట్ నన్ను అడగాలి. మిరపకాయ్ వచ్చినా మిస్టర్ బచ్చన్ వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మా అన్నయ్య (రవితేజ). మాస్ మహరాజ్ అన్న పదం ఉంచాలా, తీసేయాలా? అన్నది మీ ఇష్టం. కానీ మమ్మల్ని ఆపడం కష్టం’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు.
బ్లాక్ బస్టర్ కొడతా
‘‘మా లాస్ట్ సినిమా (మిస్టర్ బచ్చన్) సరిగ్గా ఆడలేదు. సరిగ్గా ఎంటర్ టైన్ చేయలేదు. కానీ అక్కడితో ఆగిపోం. కచ్చితంగా రవితేజతో బ్లాక్ బస్టర్ తీసి తీరతా’’ అని హరీష్ శంకర్ తెలిపాడు.
{{/usCountry}}‘‘మా లాస్ట్ సినిమా (మిస్టర్ బచ్చన్) సరిగ్గా ఆడలేదు. సరిగ్గా ఎంటర్ టైన్ చేయలేదు. కానీ అక్కడితో ఆగిపోం. కచ్చితంగా రవితేజతో బ్లాక్ బస్టర్ తీసి తీరతా’’ అని హరీష్ శంకర్ తెలిపాడు.
{{/usCountry}}కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రవితేజ, ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి, సునీల్, సత్య, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్.