Shiva Nirvana Vaishnavi: ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్న సినిమా ఇరుముడి. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి శివ నిర్వాణ చెప్పిన మాటలే అందుకు కారణం.
ఎపిక్ ట్రైలర్

తాజాగా ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఎపిక్ మూవీకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ ఎపిక్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు ఇరుముడి డైరెక్టర్ శివ నిర్వాణ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా వైష్ణవి గురించి ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ కు రష్మిక మందన్న చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం.
శివ నిర్వాణ కామెంట్లు
ఎపిక్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో శివ నిర్వాణ మాట్లాడుతూ.. వైష్ణవి చైతన్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘టక్ జగదీష్’ మూవీలో వైష్ణవి ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
‘‘టక్ జగదీష్ సినిమా షూటింగ్ లో రౌడీ వచ్చి నడుం గిల్లాలి. నీకు గుర్తుందా? రౌడీని నడుం గిల్లమని చెప్పా. కానీ వైష్ణవి అందుకు ఒప్పుకోలేదు. నేను కంఫర్టబుల్ గా లేనని చెప్పింది’’ అని శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.
ఆ మీమ్ గుర్తొచ్చింది
‘‘అప్పుడు దగ్గరకు వచ్చి.. ‘వైషూ ఇది క్యారెక్టర్, నువ్వు కాదు. నిన్ను పించ్ చేయడం లేదు. క్యారెక్టర్ ను పించ్ చేస్తున్నాడు’ అని చెప్పా. ఆ తర్వాత బేబీ చూసి షాక్ అయ్యా. అప్పుడొక మీమ్ గుర్తొచ్చింది. ‘నేను మామూలుగా చెప్పానమ్మా అంటే నేను సీరియస్ గా తీసుకున్నా సార్’ అని ఉంటుంది. క్యారెక్టర్ లా ఫీల్ అవమంటే ఏంటీ ఈ లెవల్ లో మార్పా? అని షాక్ అయ్యా. చాలా ఆనందంగా ఉంది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నాడు.
థాంక్యూ సార్
{{/usCountry}}‘‘అప్పుడు దగ్గరకు వచ్చి.. ‘వైషూ ఇది క్యారెక్టర్, నువ్వు కాదు. నిన్ను పించ్ చేయడం లేదు. క్యారెక్టర్ ను పించ్ చేస్తున్నాడు’ అని చెప్పా. ఆ తర్వాత బేబీ చూసి షాక్ అయ్యా. అప్పుడొక మీమ్ గుర్తొచ్చింది. ‘నేను మామూలుగా చెప్పానమ్మా అంటే నేను సీరియస్ గా తీసుకున్నా సార్’ అని ఉంటుంది. క్యారెక్టర్ లా ఫీల్ అవమంటే ఏంటీ ఈ లెవల్ లో మార్పా? అని షాక్ అయ్యా. చాలా ఆనందంగా ఉంది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నాడు.
థాంక్యూ సార్
{{/usCountry}}శివ నిర్వాణకు ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య థ్యాంక్స్ చెప్పింది. ‘‘టక్ జగదీష్ జర్నీ ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది. బేబీ తర్వాత మీ నుంచి కాల్ వచ్చిన రోజు కూడా గుర్తుంది. మీ మాటలు గుర్తున్నాయి. మీ సినిమాలన్నీ చూస్తూనే ఉంటా. ఇరుముడికి ఫ్యామిలీతో కలిసి వెళ్లాం. మా అమ్మమ్మ ఎమోషనల్ అయింది’’ అని వైష్ణవి చైతన్య తెలిపింది.