Jagapathi Babu: పెద్ది ఇండస్ట్రీకి పెద్ద దిక్కవుతుంది.. బెంజ్ సర్కిల్లో పుట్టాను.. ఇది నా బెస్ట్ మూవీ: జగపతి బాబు
Jagapathi Babu: విజయవాడలో జరిగిన రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరే పుట్టానని చెప్తూ, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాబోతుందని గట్టి ధీమా వ్యక్తం చేశారు.
Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. జూన్ 4న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. లేటెస్ట్ గా విజయవాడలో 'పెద్ది గ్రాండ్ రోర్' పేరుతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మెగా ఫ్యాన్స్ కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో, టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో, ఫ్యాన్స్ లో హాట్ టాపిక్గా మారాయి.

పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్.. జగపతి బాబు స్పీచ్
ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో 'అప్పలసూరి' అనే పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న జగపతి బాబు.. స్టేజ్ పై మాట్లాడుతూ విజయవాడతో తనకున్న ఎమోషనల్ బాండింగ్ ని గుర్తుచేసుకున్నారు.
"నేను పుట్టింది ఈ బెజవాడ గడ్డ మీదే. బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఓ హాస్పిటల్లో నేను పుట్టాను. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాను. అందుకే ఈ ఊరితో, ఇక్కడి జనాలతో నాకు విడదీయరాని బంధం ఉంది. విజయవాడోళ్లు మామూలోళ్లు కాదు.. ఇంత గ్రాండ్గా ఈ ఈవెంట్ను సక్సెస్ చేశారు" అని ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఇండస్ట్రీకి 'పెద్ది' పెద్ద దిక్కు.. చరణ్ యాక్టింగ్ పీక్స్
పెద్ది సినిమా రిజల్ట్ పై తనకున్న నమ్మకాన్ని జగ్గూభాయ్ ఏమాత్రం దాచుకోలేదు. "ఈ సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఓ పెద్ద దిక్కు అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర పెద్ది వేరే రేంజ్కు వెళ్లడం గ్యారెంటీ. ఆడియన్స్ ఆకలి తీర్చే అసలు సిసలైన సినిమా ఇది" అని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు.
ఒక సీనియర్ యాక్టర్, ఇండస్ట్రీ నాడి తెలిసిన వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం 'పెద్ది'పై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది. 'అరవింద సమేత' తర్వాత తనకు దక్కిన బెస్ట్ రోల్ ఇదేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ పై జగపతిబాబు ప్రశంసల వర్షం కురిపించారు. "చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూస్తారు. తను చేసిన ప్రతి సీన్ సిక్స్ కొట్టినట్లే ఉంటుంది. ఒక నటుడిగా కంటే మంచి మనిషిగా చరణ్ ఎంతో ఎదిగాడని చిరంజీవి గారు నాతో అన్నారు.. ఆ విషయాన్ని నేను సెట్స్లో కళ్లారా చూశాను" అని వివరించారు.
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు టాలెంట్ను కూడా ఆయన బాగా మెచ్చుకున్నారు. బుచ్చిబాబు చూడటానికి బఠాణీ గింజంత ఉన్నా, టాలెంట్ మాత్రం కొండంత ఉందని, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పుకొచ్చారు.
హెచ్టీ విశ్లేషణ
ఈ ప్రీ-రిలీజ్ ట్రెండ్స్ గమనిస్తే.. జగపతిబాబు లాంటి సీనియర్ నటుడు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటం సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇవ్వడం బాక్సాఫీస్ రికవరీకి చాలా అవసరం. బుచ్చిబాబు మార్క్ రా ఎమోషన్స్ కు చరణ్ స్టార్ డమ్ తోడైతే, ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
People Also Ask (FAQs)
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది?
ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది.
పెద్ది సినిమాలో జగపతిబాబు పాత్ర ఏమిటి?
ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో జగపతిబాబు 'అప్పలసూరి' అనే పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. 'అరవింద సమేత' తర్వాత తనకు దక్కిన బెస్ట్ రోల్ ఇదేనని ఆయన స్వయంగా వెల్లడించారు.
'పెద్ది' చిత్రానికి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


