జాన్వీ కపూర్ అందంగా కనిపించడానికి బఫేలో ప్లాస్టీ చేయించుకుందా? ఓ డాక్టర్ వీడియోపై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ
జాన్వీ కపూర్ అందంగా కనిపించడానికి ఎన్నో సర్జరీలు చేయించుకుందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ డాక్టర్ ఆమె బఫేలో ప్లాస్టీ చేయించుకుందని అనడంపై ఆమె స్పందించింది. టూ మచ్ షోలో పాల్గొన్న జాన్వీ ఈ కామెంట్స్ ను తిప్పికొట్టింది.
నటి జాన్వీ కపూర్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె లిప్ సర్జరీ చేయించుకుందని, ఇతర సర్జరీలు కూడా జరిగాయని లెక్కలేనన్ని పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై జాన్వీ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఆమె తన మౌనాన్ని వీడింది. ఆ పుకార్లన్నీ నిరాధారమైనవి అని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఒక డాక్టర్ తన ముఖానికి ‘బఫెలో ప్లాస్టీ’తో సహా చెప్పుకోదగ్గ ఫేషియల్ సర్జరీ జరిగిందని పేర్కొంటూ చేసిన వీడియోపై జాన్వీ ఘాటుగా స్పందించింది.

జాన్వీ కపూర్ ఏమన్నదంటే?
జాన్వీ కపూర్.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్తో కలిసి ట్వింకిల్ ఖన్నా, కాజోల్ షో 'టూ మచ్' లో పాల్గొంది. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. "నేను ఒక వీడియో చూశాను. అందులో డాక్టర్ అని చెప్పుకుంటున్న వ్యక్తి మాట్లాడుతూ.. 'ఈ వ్యక్తి తన ముఖానికి ఏమి చేశారో ఒకసారి చూద్దాం' అని అన్నారు. అతను 'బఫెలో ప్లాస్టీ' లాంటి ఒక పదాన్ని కూడా వాడాడు" అని జాన్వీ చెప్పింది.
అమ్మాయిలకు జాన్వీ సూచన
జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. "నేను ఏమైనా చేసి ఉంటే అది చాలా ఆలోచనాత్మకంగా, సందర్భోచితంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. స్పష్టంగా మా అమ్మ (శ్రీదేవి) నాకు మార్గనిర్దేశం చేసింది. ఈ వీడియోలను చూసి, మేము బఫెలో ప్లాస్టీ చేయించుకోవాలి అని నిర్ణయించుకునే యువతులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ అది తప్పుగా జరిగితే, దాని కంటే దారుణమైనది మరొకటి ఉండదు. పారదర్శకత చాలా ముఖ్యం" అని జాన్వీ గట్టిగా చెప్పింది.
బాడీ ఇమేజ్, సోషల్ మీడియా ఒత్తిళ్ల గురించి కూడా జాన్వీ మాట్లాడింది. "జనరేషన్ జీ (Gen Z)లోని యువతుల్లో నేను కూడా ఒకదాన్ని. నేను సోషల్ మీడియా ద్వారా బాగా ప్రభావితమయ్యాను. అందుకే యువతులు దీని ప్రభావానికి గురికావాలని నేను కోరుకోవడం లేదు. మీరు ఏది ఇష్టపడతారో, మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయాలని నేను గట్టిగా నమ్ముతాను" అని జాన్వీ స్పష్టం చేసింది. జాన్వీ కపూర్ చేయించుకుంది అని చెబుతున్న బఫెలో ప్లాస్టీ అనేది పై పెదవిని కొద్దిగా పైకి ఎత్తే ఒక కాస్మెటిక్ సర్జరీ అని చెబుతారు.
జాన్వీ రీసెంట్ మూవీస్
ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిగా సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్రంలో కనిపించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. తదుపరి ఆమె రామ్ చరణ్, త్రిష కృష్ణన్తో కలిసి నటించబోయే పెద్ది చిత్రంలో కనిపించనుంది. అంతకుముందు వచ్చిన పరమ్ సుందరి కూడా జాన్వీకి నిరాశనే మిగిల్చింది. ఇక తెలుగులో తీసిన తొలి సినిమా దేవర కూడా దారుణంగా బోల్తా పడింది. ఈ నేపథ్యంలో జాన్వీ ఓ పెద్ద బ్రేక్ కోసం చూస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


