Jiohotstar OTT: జియోహాట్‌స్టార్‌లో ఈ నాలుగు రోజులూ పండగే.. మలయాళం థ్రిల్లర్, తెలుగు వెబ్ సిరీస్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్

Jiohotstar OTT: జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ హాలీడేస్ వీక్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేయడానికి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ తో సిద్ధమైంది. మంగళవారం (ఆగస్ట్ 25) నుంచి ఆగస్ట్ 29 వరకు ఓ తెలుగు వెబ్ సిరీస్ తోపాటు మలయాళం థ్రిల్లర్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ రానున్నాయి.

Published on: Aug 25, 2026, 14:08:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jiohotstar OTT: ఈ వారం ఓటీటీ ఆడియన్స్ కి అసలైన ఎంటర్‌టైన్మెంట్ విందు ఇచ్చేందుకు జియోహాట్‌స్టార్ పక్కా ప్లాన్‌తో రెడీ అయిపోయింది. ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 29 వరకు యాక్షన్, రొమాన్స్, బిజినెస్ డ్రామా, మైఖేల్ జాక్సన్ బయోపిక్ వరకు ఏకంగా 6 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్టీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ థ్రిల్లర్ 'ఐ నోబడీ' నుంచి తెలుగు వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్' వరకు ఏవి ఎప్పుడు వస్తున్నాయో క్లియర్‌గా చూసేయండి.

Jiohotstar OTT: జియోహాట్‌స్టార్‌లో ఈ నాలుగు రోజులూ పండగే.. మలయాళం థ్రిల్లర్, తెలుగు వెబ్ సిరీస్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్
Jiohotstar OTT: జియోహాట్‌స్టార్‌లో ఈ నాలుగు రోజులూ పండగే.. మలయాళం థ్రిల్లర్, తెలుగు వెబ్ సిరీస్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్

జియోహాట్‌స్టార్ రిలీజెస్ ఇవే

1. ఐ నోబడీ : ఆగస్ట్ 25 (మలయాళం థ్రిల్లర్)

2. పార్ట్ టైమర్స్ : ఆగస్ట్ 28 (తెలుగు వెబ్ సిరీస్)

3. ఠుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 : ఆగస్ట్ 28 (హిందీ వెబ్ సిరీస్)

4. అడల్ట్స్ సీజన్ 2 : ఆగస్ట్ 28 (ఇంగ్లిష్ కామెడీ వెబ్ సిరీస్)

5. మోగ్లీ : ఆగస్ట్ 28 (యానిమేటెడ్ సిరీస్)

6. మైఖేల్ : ఆగస్ట్ 29 (మైఖేల్ జాక్సన్ బయోపిక్)

1. ఐ నోబడీ (I Nobody) - ఆగస్ట్ 25

మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో వచ్చిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐ నోబడీ'. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఆగస్ట్ 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమాలో పృథ్వీరాజ్ తన మార్క్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అలరించారు. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, మైండ్ బెండింగ్ ట్విస్టులు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

2. పార్ట్ టైమర్స్ (Part Timers) - ఆగస్ట్ 28 (తెలుగు వెబ్ సిరీస్)

తెలుగు యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందిన లేటెస్ట్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'పార్ట్ టైమర్స్'. ఒకే రూమ్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని కలలు కంటుంటారు.

ఆ కల నెరవేర్చుకోవడానికి వారు చేసే రకరకాల పార్ట్-టైమ్ జాబ్స్, ఎదుర్కొనే సరదా సంఘటనలు, ఎమోషనల్ సీన్లతో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ఆగస్ట్ 28 నుంచి ఈ ఫన్ రైడ్ స్ట్రీమింగ్ కానుంది.

3. ఠుక్రా కే మేరా ప్యార్ (Thukra Ke Mera Pyaar) - ఆగస్ట్ 28

హిందీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న పాపులర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్ 'ఠుక్రా కే మేరా ప్యార్'. ప్రతి వారం కొత్త ఎపిసోడ్లతో ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ వెబ్ సిరీస్ నుంచి తదుపరి ఎపిసోడ్ ఆగస్ట్ 28న రిలీజ్ కాబోతోంది.

ప్రేమ, ద్రోహం, రివేంజ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సీరియల్ కంటెంట్ యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

4. అడల్ట్స్ సీజన్ 2 (Adults Season 2) - ఆగస్ట్ 28

యూత్‌ఫుల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'అడల్ట్స్' మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యాక, సరిగ్గా రెండు నెలల గ్యాప్‌లోనే సీజన్ 2 ప్రేక్షకు ముందుకు వస్తోంది. ఆగస్ట్ 28 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మొదటి సీజన్ ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే కథను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కొత్త సీజన్‌లో ప్రధాన పాత్రల వివాహ బంధం, దానికి సంబంధించిన ఆసక్తికర ఎపిసోడ్లను చూపించబోతున్నారు.

5. మోగ్లీ (Mowgli) - ఆగస్ట్ 28 (కిడ్స్ స్పెషల్)

పిల్లలను అలరించేందుకు ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ 'మోగ్లీ' యానిమేషన్ సిరీస్ మళ్లీ వచ్చేస్తోంది. అడవి నేపథ్యంలో మనుషులకు, జంతువులకు ఉన్న అనుబంధాన్ని ఈ సిరీస్‌లో అందంగా ఆవిష్కరించారు.

ఆగస్ట్ 28 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సిరీస్‌ను హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయవచ్చు.

6. మైఖేల్ (Michael) - ఆగస్ట్ 29 (మైఖేల్ జాక్సన్ బయోపిక్)

పాప్ ప్రపంచానికి రారాజు మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ మూవీ 'మైఖేల్'. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ బయోపిక్ మూవీ ఆగస్ట్ 29 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్‌లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మైఖేల్ జాక్సన్ పర్సనల్ లైఫ్, మ్యూజిక్ జర్నీని ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో పిక్చరైజ్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More