జియోహాట్స్టార్లోని టాప్ 5 వెబ్ సిరీస్లు- 2025లో ఓటీటీని షేక్ చేసిన వీటిపై ఓ లుక్కేయండి
2025లో జియోసినిమా రిలీజ్ చేసిన టాప్ 10 వెబ్ సిరీస్ల జాబితా వచ్చేసింది! క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ, డ్రామాతో 'మిస్సింగ్ మిసెస్ దేశ్పాండే', 'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్', 'స్పెషల్ ఆప్స్ సీజన్ 2' వంటివి ఈ లిస్టులో ఉన్నాయి.
2025లో జియోహాట్స్టార్ కొన్ని వెబ్ సిరీస్లను విడుదల చేసింది. ఇందులో 2025లో టాప్ వెబ్ సిరీస్ లు ఏంటో ఇక్కడున్నాయి. ఈ 5 సిరీస్ లపై ఓ లుక్కేయండి.

మిస్సింగ్ మిసెస్ దేశ్పాండే
ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇందులో మాధురి దీక్షిత్ జైలులో ఉన్న సీరియల్ కిల్లర్గా నటించారు. మాధురి దీక్షిత్, సిద్ధార్థ్ చందేకర్, ప్రియాన్షు ఛటర్జీ తదితరులు నటించారు. సీమా దేశ్పాండే 25 ఏళ్లుగా ఏకాంత నిర్బంధంలో ఉన్న ఒక సీరియల్ కిల్లర్. ఆమె హత్యల తరహాలోనే కొత్త హత్యలు జరిగినప్పుడు, పోలీసులు ఆమె సహాయం కోరతారు. ఆమె తన దూరమైన కొడుకు, ఇన్స్పెక్టర్ తేజస్ ఫడ్కే తనతో పనిచేస్తేనే సహాయం చేస్తానని అంగీకరిస్తుంది.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్
ఇది ఒక మిస్టరీ వెబ్ సిరీస్. ఇందులో కొంకణా సేన్ శర్మ ఒక టీనేజ్ అమ్మాయి హత్యను దర్యాప్తు చేసే ఇన్వెస్టిగేటర్గా నటించారు. కొంకణా సేన్ శర్మ, సూర్య శర్మ, శివ్ పండిట్ తదితరులు నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ట్విస్ట్ లతో ఆకట్టుకుంటుంది.
నవీ ముంబై సరస్సులో మునిగిపోయిన కారులో దొరికిన యూనివర్సిటీ విద్యార్థిని నైనా మరాఠే హత్య కేసు దర్యాప్తు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఏసీపీ సంయుక్త దాస్, ఆమె స్థానంలోకి వచ్చిన జై కన్వల్ ఆరు ఉత్కంఠభరితమైన రోజులు కలిసి పనిచేస్తారు. సీజన్ ఒక పెద్ద క్లిఫ్ హ్యాంగర్తో ముగుస్తుంది. ఇది ఓటీటీలో కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది.
కన్నెడ
ఇది చందన్ అరోరా దర్శకత్వం వహించిన ఎనిమిది ఎపిసోడ్ల హిందీ క్రైమ్-డ్రామా. పర్మిష్ వర్మ, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, రణ్వీర్ షోరే కీలక పాత్రలు పోషించారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల తర్వాత భారతదేశం నుండి పారిపోయిన నిమ్మా చహల్ కథ ఇది. అతను కొత్త జీవితం కోసం, రూబీ, సంగీతం కోసం వాంకోవర్కు వెళ్తాడు. జాతి వివక్ష, ఒంటరితనం ఎదుర్కొని, అతను గ్యాంగ్ సంస్కృతిలో చిక్కుకుంటాడు. అతను క్రైమ్ లార్డ్ రాంధవాలో చేరుతాడు.
స్పెషల్ ఆప్స్: సీజన్ 2
ఈ హై-స్టేక్స్ గూఢచర్య థ్రిల్లర్లో కేకే మీనన్ హిమ్మత్ సింగ్గా తిరిగి వస్తాడు. కేకే మీనన్ తో పాటు వినయ్ పాఠక్, కరణ్ టాకర్ తదితరులు నటించిన స్పై థ్రిల్లర్ ఇది. భారతదేశ అగ్రగామి ఏఐ నిపుణుడు డాక్టర్ పియూష్ భార్గవ్ ఒక టెక్ సమ్మిట్ సందర్భంగా కిడ్నాప్ కావడంతో కొత్త సీజన్ సైబర్-టెర్రరిజం వైపు మళ్లుతుంది.
క్రిమినల్ జస్టిస్: సీజన్ 4
పంకజ్ త్రిపాఠి న్యాయవాది మాధవ్ మిశ్రాగా కొత్త సంక్లిష్టమైన న్యాయ పోరాటంలో తన పాత్రను పునరావృతం చేస్తాడు. కాస్ట్: పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, సర్వీన్ చావ్లా. కథ: అగ్రశ్రేణి సర్జన్ డాక్టర్ రాజ్ నాగ్పాల్ తన ప్రియురాలు రోష్ణి మృతదేహాన్ని పట్టుకుని కనిపిస్తాడు. అతను ప్రధాన అనుమానితుడిగా మారతాడు. అప్పుడు, అతని దూరం అయిన భార్య అంజు న్యాయవాది మాధవ్ మిశ్రాను నియమిస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


