...
...
Next Story

Jr NTR: జులై 18న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ? సోషల్ మీడియాలో 'సీఎం ఎన్టీఆర్' బ్యానర్లు.. అసలు నిజం బయటపెట్టిన తారక్ టీమ్!

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై అతని టీమ్ క్లారిటీ ఇచ్చింది. అందులో ఏమాత్రం నిజం లేదంటూ ఆ సంస్థతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

Published on: Jul 14, 2026 02:21 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jr NTR: 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్లకు ఆయన ఆఫీస్ స్పష్టమైన ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టింది. 'RAW NTR' అనే స్వతంత్ర సంస్థ గ్రామీణ అభివృద్ధి కోసం చేపట్టిన 'ఊరు వాడ' క్యాంపెయిన్‌తో తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

Jr NTR: జులై 18న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ? సోషల్ మీడియాలో 'సీఎం ఎన్టీఆర్' బ్యానర్లు.. అసలు నిజం బయటపెట్టిన తారక్ టీమ్!
Jr NTR: జులై 18న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ? సోషల్ మీడియాలో 'సీఎం ఎన్టీఆర్' బ్యానర్లు.. అసలు నిజం బయటపెట్టిన తారక్ టీమ్!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. 'RAW NTR' అనే ఆర్గనైజేషన్ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయడంతో అందరూ ఇది ఎన్టీఆర్ పెట్టిన పొలిటికల్ వింగే అని ఫిక్స్ అయిపోయారు. తమిళనాడులో విజయ్ క్షేత్రస్థాయిలో చేసిన రాజకీయ సేవల తరహాలోనే తారక్ కూడా ప్లాన్ చేస్తున్నారంటూ నెటిజన్లు పోలికలు తీసుకువచ్చారు.

జులై 18 అనౌన్స్‌మెంట్ రూమర్స్

ఈ బజ్ కాస్తా జులై 18న ఎన్టీఆర్ ఒక పెద్ద రాజకీయ ప్రకటన చేయబోతున్నారనే రేంజ్‌కు వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల ఏకంగా "CM NTR" అంటూ బ్యానర్లు కూడా వెలిశాయి. దాంతో తారక్ ఫ్యాన్స్ సైతం నిజంగానే అన్నయ్య పాలిటిక్స్‌లోకి వస్తున్నాడేమో అని నమ్మడం స్టార్ట్ చేశారు. ఈ పొలిటికల్ నెట్‌వర్క్ గురించిన రూమర్లు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగక తప్పలేదు.

ఎన్టీఆర్ ఆఫీస్ అఫీషియల్ క్లారిటీ

ఈ రూమర్లన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ ఎన్టీఆర్ ఆఫీస్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 'RAW NTR' సంస్థతో గానీ, వాళ్లు చేసే కార్యక్రమాలతోగానీ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

భవిష్యత్తులో ఎన్టీఆర్ చేయబోయే ఎలాంటి సేవా కార్యక్రమాలు అయినా, ప్రజా సంక్షేమ పనులు అయినా కేవలం ఆయన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే అనౌన్స్ చేస్తారని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

మీడియా, జనం ఇలాంటి ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల ప్రచారం తర్వాత ఎన్టీఆర్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే.

సినిమాలతో ఫుల్ బిజీగా తారక్

రాజకీయాల్లోకి ఎంట్రీ పుకార్లు ఎలా ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టిన 'దేవర' పార్ట్ 1 సక్సెస్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది.

ప్రస్తుతం ఆయన లైనప్‌లో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' మూవీ ఉంది. దీంతో పాటు కొరటాల శివ డైరెక్షన్‌లో 'దేవర 2', అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ భారీ లైనప్ చూస్తుంటే తారక్ ఫోకస్ మొత్తం వెండితెరపైనే ఉందని క్లియర్ గా అర్థమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe