...
...
Next Story

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ- డైరెక్టర్ ఔట్- సుందర్ సి ఎగ్జిట్‌పై క‌మ‌ల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-కార‌ణం ఏంటంటే?

కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొద్ది రోజులకే సుందర్ తప్పుకున్నారు. దీనిపై తాజాగా కమల్ హాసన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: Nov 15, 2025 03:15 PM IST
Advertisement

ఈ నెల ప్రారంభంలో కమల్ హాసన్, రజినీకాంంత్ కలిసి 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఒక సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా 2027 పొంగల్ నాటికి విడుదల కానుంది. సుందర్ సి దీనికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ ప్రకటన జరిగిన కొద్ది రోజులకే సుందర్ సి.. ఊహించని, తప్పించుకోలేని పరిస్థితుల కారణంగా సినిమా నుండి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

కమల్ కామెంట్లు

సుందర్ పై కమల్ వ్యాఖ్యలు
సుందర్ పై కమల్ వ్యాఖ్యలు

అయితే శనివారం (నవంబర్ 15) ఈ మూవీ నుంచి సుందర్ సి తప్పుకోవడంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విలేకరులతో విమానాశ్రయం వెలుపల మాట్లాడుతూ.. “సుందర్ సి తన ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రాజెక్ట్ నుండి వైదొలగడానికి గల కారణాన్ని వివరించారు. ఒక ఇన్వెస్టర్ గా నా స్టార్‌కు నచ్చే స్క్రిప్ట్ ఈ సినిమాకు కావాలి. అదే సరైన మార్గం. ఆయనకు నచ్చే వరకు మేము సరైన కథల కోసం వెతుకుతూనే ఉంటాము. నా స్టార్ స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందే వరకు, మేము దాని కోసం వెతుకుతూనే ఉంటాము. ప్రస్తుతం మేము ఒక నాణ్యమైన స్క్రిప్ట్‌ను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం” అని కమల్ చెప్పారు.

కథే కారణం

కమల్ హాసన్- రజనీకాంత్ మూవీ నుంచి సుందర్ సి తప్పుకోవడానికి కథే కారణమని తెలుస్తోంది. కమల్ హాసన్ కూడా అదే మాటలు చెప్పారు. సుందర్ సి చెప్పిన కథ కమల్ కు అంతగా నచ్చలేదని సమాచారం. కానీ దీనిపై పట్టు వదలని సుందర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే ఎలాంటి కథ కావాలని చూస్తున్నారని కమల్ ను అడిగితే.. “ఊహించని దానిని ఆశించండి” అని పేర్కొన్నారు.

సుందర్ ఔట్

కూలీ విడుదల కావడానికి ముందే రజనీకాంంత్, కమల్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారనే సంకేతాలు కనిపించాయి. కమల్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో 'తగ్ లైఫ్' చిత్రంలో కనిపించారు. రజనీకాంత్ ఏమో కూలీ మూవీతో హిట్ కొట్టారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe