Sara Ali Khan: ఇక్కడున్న అందరూ సనాతనులే.. సనాతనమే సత్యం.. ఇక రాసివ్వడానికి ఇబ్బందేంటి: సారా అలీ ఖాన్పై కంగనా కామెంట్స్
Sara Ali Khan: సారా అలీ ఖాన్ కేదార్నాథ్ ఆలయ సందర్శనపై నెలకొన్న వివాదంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించింది. ఇక్కడున్న అందరూ సనాతనులే అంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కేదార్నాథ్ వెళ్లాలంటే కచ్చితంగా తన మతం, విశ్వాసం గురించి ఒక అఫిడవిట్ రాసివ్వాలని బద్రీ-కేదార్ టెంపుల్ కమిటీ (BKTC) ఛైర్మన్ హేమంత్ ద్వివేది చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అవుతున్నాయి. ఈ ఇష్యూపై యాక్టర్, మండి ఎంపీ కంగనా రనౌత్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయింది. సారా కూడా సనాతనియే అని, ఆ నిజాన్ని రాసివ్వడానికి ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదని కంగనా తేల్చి చెప్పింది.

అఫిడవిట్ ఇస్తే తప్పేంటి? - కంగనా కామెంట్స్
పార్లమెంట్ సెషన్స్కు వెళ్లే ముందు బుధవారం (మార్చి 18) మీడియాతో మాట్లాడిన కంగనాకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె చాలా స్ట్రాంగ్గా ఆన్సర్ ఇచ్చింది.
"ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సనాతనులే. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఉన్నది అదే. సనాతన ధర్మానికి ఆది, అంతం లేదు. మిగతా మతాలన్నీ మహా అయితే వెయ్యి, పదిహేనొందల ఏళ్ల క్రితం పుట్టినవి. కానీ సనాతన ధర్మం మాత్రమే అసలైన నిజం. సారా అలీ ఖాన్ కూడా సనాతనియే. మరి ఆ నిజాన్ని పేపర్ మీద రాసివ్వడానికి ఆమె ఎందుకు భయపడాలి? రాసిచ్చేయొచ్చు కదా" అని కంగనా తన ఒపీనియన్ చెప్పింది.
అసలు టెంపుల్ కమిటీ ఛైర్మన్ ఏమన్నారంటే..
మంగళవారం (మార్చి 17) జరిగిన ఒక ప్రెస్ మీట్లో బీకేటీసీ (BKTC) ఛైర్మన్ హేమంత్ మాట్లాడుతూ ఒక కొత్త ప్రపోజల్ గురించి చెప్పారు.
హిందువులు కాకుండా వేరే మతాలకు చెందిన వాళ్లు బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్స్లోకి ఎంటర్ అవ్వాలంటే కచ్చితంగా వాళ్లు సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని నమ్ముతున్నట్లు ఒక అఫిడవిట్ లేదా రిటన్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్లో మొదలుకాబోయే 'చార్ ధామ్ యాత్ర' కంటే ముందే ఈ ప్రపోజల్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పంపించేశారు.
ముఖ్యంగా సారా అలీ ఖాన్ గురించి అడిగినప్పుడు.. "సారాకు సనాతన ధర్మం మీద భక్తి, నమ్మకం ఉంటే, ఆ విషయాన్ని ఆమె ఒక అఫిడవిట్ ద్వారా సబ్మిట్ చేస్తే కచ్చితంగా ఆమెకు దేవుడి దర్శనం దొరుకుతుంది" అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కేదార్నాథ్ నా పర్సనల్ ఎమోషన్: సారా అలీ ఖాన్
సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ ముస్లిం కాగా, తల్లి అమృతా సింగ్ సిక్కు మతానికి చెందిన ఆవిడ. అయితే సారాకు కేదార్నాథ్ అంటే చాలా ఇష్టం. ఆమె తరచుగా ఆ టెంపుల్కు వెళ్తూ ఉంటుంది. దీనిపై 2025 టైమ్స్ నౌ సమ్మిట్లో సారా మాట్లాడుతూ.. "నేను యాక్టర్ అవ్వకముందు నుంచే కేదార్నాథ్కు వెళ్తున్నాను. జనాలు నన్ను మెచ్చుకోవాలని నేను అక్కడికి వెళ్లట్లేదు. కేదార్నాథ్ అనేది నా పర్సనల్ ట్రిప్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకొచ్చే నష్టం లేదు. నేను ఆ గుడిలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా, కంఫర్టబుల్గా, హ్యాపీగా ఫీల్ అవుతాను" అని విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


