కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరో నాలుగు రోజుల్లోనే.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

కాంతార ఛాప్టర్ 1 అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తున్నా.. అనూహ్యంగా ఈవారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేయబోతోంది.

Published on: Oct 27, 2025, 17:33:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు మరీ ఎక్కువ రోజులు ఎదురు చూడకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తోంది. ఆదివారం (అక్టోబర్ 26) రాత్రి ఈ మూవీ స్ట్రీమింగ్ పై అప్డేట్ ఇచ్చిన ఆ ఓటీటీ.. సోమవారం సాయంత్రానికి స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసేసింది.

కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరో నాలుగు రోజుల్లోనే.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరో నాలుగు రోజుల్లోనే.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

కాంతార ఛాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన కాంతార ఛాప్టర్ 1 మూవీ ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31 నుంచే స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

“బెర్మె లెజెండరీ అడ్వెంచర్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి. కాంతార ఛాప్టర్ 1 అక్టోబర్ 31న ప్రైమ్ లోకి.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ చిన్న వీడియో క్లిప్ ను షేర్ చేసింది.

కాంతార ఛాప్టర్ 1 మూవీ గురించి..

కాంతార ఛాప్టర్ 1 ఈ నెల అంటే అక్టోబర్ 2నే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుండటం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచింది. అలాంటి మూవీని ఇంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ చేయనుండటం విశేషమే.

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన మూవీ ఇది. 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్. ఆ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూలు చేయగా.. ఇది అంతకంటే ఎంతో మెరుగ్గా సక్సెస్ సాధించింది. ఆ కథ జరిగిన 800 సంవత్సరాలకు ముందు జరిగిన కథగా ఈ కాంతార ఛాప్టర్ 1ను రూపొందించారు. ఇందులో బెర్మె అనే పాత్రలో రిషబ్ శెట్టి నటించాడు. రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్యలాంటి వాళ్లు కూడా నటించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More