...
...
Next Story

కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్ వచ్చేసింది.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన మహానటి.. మరోసారి సునీల్ విలనిజం

కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటించిన రివాల్వర్ రీటా మూవీ ట్రైలర్ వచ్చేసింది. చాలా రోజులుగా ఊరిస్తున్న ఈ సినిమా మొత్తానికి నవంబర్ 28న రిలీజ్ కానుంది. ట్రైలర్ చాలా ఫన్నీగా సాగిపోయింది. యాక్షన్ తో కీర్తి అదరగొట్టింది.

Published on: Nov 13, 2025 07:46 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ మరోసారి మాస్ యాక్షన్ అవతార్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె నటించిన రివాల్వర్ రీటా మూవీ ట్రైలర్ గురువారం (నవంబర్ 13) రిలీజైంది. ఈ మూవీలో సునీల్ కూడా విలన్ గా తిరిగి వస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఆసక్తికరంగా ఉండబతోంది.

రివాల్వర్ రీటా ట్రైలర్

కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్ వచ్చేసింది.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన మహానటి.. మరోసారి సునీల్ విలనిజం
కీర్తి సురేష్ రివాల్వర్ రీటా ట్రైలర్ వచ్చేసింది.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన మహానటి.. మరోసారి సునీల్ విలనిజం

చాలా రోజులుగా ఊరిస్తున్న మూవీ రివాల్వర్ రీటా. కీర్తి సురేష్ ఈ టైటిల్ రోల్ పోషిస్తోంది. మూవీ ఓ మాంచి కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ గా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ ట్రైలర్ మొదట్లోనే విలన్ తండ్రి కిడ్నాప్ కావడం, అతన్ని రీటానే ఎత్తుకెళ్లడం, తర్వాత ఆమె ఇంట్లోనే అతడు చనిపోవడం, ఆ విషయం తెలిస్తే తమ పరిస్థితి ఏమవుతుందో అని వాళ్లు భయపడటం, తన ఇంట్లో వాళ్లను కాపాడటానికి రివాల్వర్ రీటా బయలుదేరడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. 2 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపేలా సాగింది. కీర్తి యాక్షన్, సునీల్ విలనిజం ఇందులో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతోంది అన్నది థియేటర్లలో చూడాలి.

రివాల్వర్ రీటా మూవీ గురించి..

కీర్తి సురేష్ గతేడాది చివర్లో బేబీ జాన్, ఈ ఏడాది నేరుగా ప్రైమ్ వీడియోలో రిలీజైన ఉప్పు కప్పురంబు సినిమాల్లో నటించినా.. ఈ రెండూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడీ రివాల్వర్ రీటాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాను జేకే చంద్రు డైరెక్ట్ చేశాడు. ఇందులో కీర్తి సురేష్, సునీల్ తోపాటు రాధిక, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్‌లే, జాన్ విజయ్ లాంటి వాళ్లు నటించారు. ఇదొక క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన సినిమా.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe