...
...
Next Story

Kiran Abbavaram: ఈ సినిమా 50 కుటుంబాల కల.. దయచేసి ఈ మూవీని సపోర్ట్ చేయండి: సెలబ్రిటీలకు కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తాను నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమాను సపోర్ట్ చేయమని అడిగాడు. 1996 నాటి రాయలసీమ నేపథ్యంలో, ఒక మారుమూల పల్లెటూరికి వచ్చిన మొదటి టెలివిజన్ సెట్ ఎలాంటి మలుపులు తిప్పింది? అనే ఆసక్తికర కథాంశంతో వస్తున్న 'తిమ్మరాజుపల్లి టీవీ' ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమైంది.

Published on: Apr 15, 2026, 13:58:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Kiran Abbavaram: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్నాడు. అతని నిర్మాణంలో రూపొందిన తాజా మూవీ 'తిమ్మరాజుపల్లి టీవీ'. డెబ్యూ డైరెక్టర్ వి. మునిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రమోషన్లతో ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ఈవెంట్లో కిరణ్ మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి.

దయచేసి ఈ సినిమాను సపోర్ట్ చేయండి

Kiran Abbavaram: ఈ సినిమా 50 కుటుంబాల కల.. దయచేసి ఈ మూవీని సపోర్ట్ చేయండి: సెలబ్రిటీలకు కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్
Kiran Abbavaram: ఈ సినిమా 50 కుటుంబాల కల.. దయచేసి ఈ మూవీని సపోర్ట్ చేయండి: సెలబ్రిటీలకు కిరణ్ అబ్బవరం రిక్వెస్ట్

రాయలసీమ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన తిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఏప్రిల్ 17న రిలీజ్ కానుండగా.. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇందులో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఈ సినిమా సుమారు 40 నుంచి 50 కుటుంబాల కల. నా సినిమాను సపోర్ట్ చేయమని నేనెప్పుడూ ఏ సెలబ్రిటీని అడగలేదు. కానీ ఈ సినిమాను సపోర్ట్ చేయండి. నా వంతు నేను చిన్న సాయం చేశాను. ఇలాంటి కొత్త వాళ్లకు సాయం చేయాలి. మన కడుపు నిండితే సరిపోదు. వీళ్లకు చేయాలి. అది కూడా గొప్ప విషయం ఏమీ కాదు. దయచేసి ఈ తిమ్మరాజుపల్లి టీవీకి సపోర్ట్ చేయండి. తక్కువ బడ్జెట్ లో చాలా బాగా తీశారు” అని అన్నాడు.

ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమాలకు ఒక ‘బెంచ్‌మార్క్’లా నిలుస్తుందని, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని అతడు చెప్పాడు. కేవలం కథ మాత్రమే కాకుండా.. సాంకేతికంగా కూడా సినిమా చాలా బలంగా ఉంటుందని కిరణ్ హామీ ఇచ్చాడు.

1996 నాటి రాయలసీమ మ్యాజిక్

ఈ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కథా నేపథ్యం మొత్తం 1996 కాలంలో సాగుతుంది. రాయలసీమలోని 'తిమ్మరాజుపల్లి' అనే గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ రోజుల్లో ఒక గ్రామానికి మొదటిసారి టీవీ రావడం అనేది ఒక పెద్ద పండగ లాంటిది.

సినిమాకు ప్రధాన ఆకర్షణ వంశీకాంత్ అందించిన సంగీతం, సౌండ్ డిజైన్. థియేటర్‌లో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ మరియు లతీష్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

వేసవి సెలవుల కానుకగా వస్తున్న ఈ సస్పెన్స్ డ్రామా, అటు పాత రోజులను గుర్తు చేస్తూనే, ఇటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

2. తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కథా నేపథ్యం ఏమిటి?

ఇది 1996 కాలంలో రాయలసీమలోని ఒక పల్లెటూరిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఒక గ్రామానికి వచ్చిన మొదటి టెలివిజన్ చుట్టూ తిరిగే సస్పెన్స్ డ్రామా ఇది.

3. తిమ్మరాజుపల్లి టీవీ సినిమాకు నిర్మాత ఎవరు?

ప్రముఖ టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe