హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఓటీటీ.. వచ్చేది ఈ రోజు కాదు.. డిజిటల్ స్ట్రీమింగ్, టీవీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన జీ5

తెలుగు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ కిష్కింధపురి సినిమా ఈ రోజు ఓటీటీలోకి రావడం లేదు. ఈ మూవీ అక్టోబర్ 10నే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుందనే వార్తలొచ్చాయి. కానీ జీ5 మాత్రం డేట్లు మార్చేసింది. 

Published on: Oct 10, 2025 1:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ వీడింది. ఇవాళ (అక్టోబర్ 10) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం లేదు. అక్టోబర్ 10న కిష్కింధపురి ఓటీటీలోకి వస్తుందనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు జీ5 నెట్ వర్క్ వేరే డేట్లను ప్రకటించింది. ఓటీటీతో పాటు టీవీ ప్రీమియర్ డేట్ నూ అనౌన్స్ చేసింది.

కిష్కింధపురి పోస్టర్ లో సాయి శ్రీనివాస్, అనుపమ (x/ZEE5Telugu)
కిష్కింధపురి పోస్టర్ లో సాయి శ్రీనివాస్, అనుపమ (x/ZEE5Telugu)

కిష్కింధపురి ఓటీటీ

హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. ఇక అక్టోబర్ 19న సాయంత్రం 6 గంటలకు టీవీలో వస్తుందని అనౌన్స్ చేశారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో, జీ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుంది.

హారర్ థ్రిల్లర్

వణికించే హారర్ థ్రిల్లర్ గా కిష్కింధపురి తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీయాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ మూవీకి కౌళిక్ పెగళ్లపాటి డైరెక్టర్. సాహు గారపాటి నిర్మించారు.

కిష్కింధపురి కథ ఏమిటంటే?

సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో ఉన్న వేదవతి దెయ్యం, దాని నుంచి పాపను కాపాడటం చుట్టూ కిష్కింధపురి కథ తిరుగుతుంది. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లవర్స్. వీళ్లిద్దరు మరో ఫ్రెండ్ తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో టూర్స్ నిర్వహిస్తారు. పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి, అక్కడ దెయ్యాలున్నాయని నమ్మించి వచ్చిన వాళ్లకు థ్రిల్ పంచుతారు.

సువర్ణమాయ

ఈ క్రమంలోనే కిష్కింధపురి గ్రామానికి దగ్గర్లోనే పాడుబడ్డ సువర్ణ మాయ అనే రేడియో స్టేషన్ కు 11 మందిని తీసుకెళ్తారు. అక్కడి వెళ్లాక పరిస్థితులు తారుమారవుతాయి. అక్కడ రేడియోలో నుంచి ఓ వాయిస్ వినిపిస్తుంది. అది దెయ్యం వేదవతి వాయిస్ అని తెలుస్తుంది. ఆ దెయ్యం 11 మందిలో ఎవరినీ వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి ముగ్గురిని చంపేస్తుంది. ఆ తర్వాత ఓ పాపను చంపాలని చూస్తుంది. కానీ రాఘవ్ పాపను కాపాడటం కోసం దెయ్యానికి ఎదురు వెళ్తాడు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దెయ్యంగా మారిన వేదవతి కథ ఏంటీ? ఎందుకు జనాలను చంపుతుంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు కిష్కింధపురి బెస్ట్ ఆప్షన్.