Kishore Kumar Song With 8 Female Singers Vidhata Story: గాన గంధర్వుడు, స్టార్ సంగీత దర్శకుడు కిశోర్ కుమార్ పాడారంటే ఆ పాటలో ఒక మ్యాజిక్ ఉంటుంది. హిందీతో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషల్లో వేలాది అద్భుతమైన పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
8 మంది లేడి సింగర్స్తో

ఆయన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని, ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ సింగర్ కూడా బ్రేక్ చేయని ఒక విచిత్రమైన రికార్డ్ కిశోర్ కుమార్ పేరిట ఉంది. ఒకే ఒక్క పాట కోసం ఆయన ఏకంగా 8 మంది మహిళా సింగర్స్తో కలిసి మైక్ పంచుకున్నారు. అదే సమయంలో ఆ పాట ఆయన కెరీర్లోనే అత్యంత వివాదాస్పద గీతంగా నిలవడం గమనార్హం.
మ్యూజిక్కు ప్రత్యేకత
సాధారణంగా ఒక పాటలో ఇద్దరు లేదా ముగ్గురు సింగర్స్ కలిసి పాడటం చూస్తుంటాం. కానీ, దర్శకుడు సుభాష్ ఘాయ్ చిత్రాల్లోని మ్యూజిక్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. 1982లో సంజయ్ దత్ హీరోగా, దిగ్గజ నటులు దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా 'విధాత' కోసం ఈ అద్భుత ప్రయోగం చేశారు.
ఈ సినిమాకు ప్రముఖ సంగీత ద్వయం కల్యాణ్ జీ - ఆనంద్ జీ మ్యూజిక్ అందించారు. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండగా.. అందులో ‘సాత్ సహేలియాన్ ఖడీ ఖడీ, ఫరియాద్ సునాయే ఘడీ ఘడీ’ అనే పాటను డిజైన్ చేశారు.
స్టూడియో నుంచి పారిపోవాలని చూసిన కిశోర్ కుమార్!
ఈ పాట రికార్డింగ్ కోసం కిశోర్ కుమార్ స్టూడియోకు చేరుకోగానే అక్కడ లైన్గా నిలబడి ఉన్న 8 మంది మహిళా గాయనులను చూసి షాక్కు గురయ్యారు. ఆ సింగర్స్ జాబితాలో హేమలత, కంచన్, అనురాధ పౌడ్వాల్, సాధనా సర్గమ్, అల్కా యాగ్నిక్లతో పాటు ఆ సినిమా హీరోయిన్ పద్మిని కొల్హాపురే, ఆమె సోదరి శివాంగి కొల్హాపురే ఉన్నారు.
{{/usCountry}}ఈ పాట రికార్డింగ్ కోసం కిశోర్ కుమార్ స్టూడియోకు చేరుకోగానే అక్కడ లైన్గా నిలబడి ఉన్న 8 మంది మహిళా గాయనులను చూసి షాక్కు గురయ్యారు. ఆ సింగర్స్ జాబితాలో హేమలత, కంచన్, అనురాధ పౌడ్వాల్, సాధనా సర్గమ్, అల్కా యాగ్నిక్లతో పాటు ఆ సినిమా హీరోయిన్ పద్మిని కొల్హాపురే, ఆమె సోదరి శివాంగి కొల్హాపురే ఉన్నారు.
{{/usCountry}}ఒకేసారి అంతమంది లేడీ సింగర్స్ను చూసి కంగారుపడిన కిశోర్ కుమార్.. "నేను ఈ పాట పాడలేను, ఇక్కడ ఇరుక్కుపోయాను" అంటూ స్టూడియో నుంచి వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించారు. మ్యూజిక్ డైరెక్టర్లు ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదు. చివరకు ఆ సినిమాలో నటిస్తున్న సీనియర్ నటుడు షమ్మీ కపూర్ స్వయంగా రంగంలోకి దిగి, కిశోర్ కుమార్ను బ్రతిమలాడి ఒప్పించడంతోనే ఈ క్లాసిక్ సాంగ్ రికార్డింగ్ పూర్తయింది.
రేడియో, దూరదర్శన్లో నిషేధం.. అయినా బాక్సాఫీస్ షేక్!
ప్రముఖ రచయిత ఆనంద్ బక్షీ రాసిన ఈ పాట రికార్డింగ్ ముగిసిన తర్వాత షమ్మీ కపూర్, పద్మిని కొల్హాపురేలపై దీనిని అత్యంత ఘనంగా చిత్రీకరించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ పాటలోని కొన్ని లైన్లు కాస్త శృంగారభరితంగా, డబుల్ మీనింగ్తో అశ్లీలంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దాంతో అప్పట్లో ప్రభుత్వ అధికారిక మీడియా ఛానళ్లు అయిన ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్ లు ఈ పాటను ప్రసారం చేయకుండా నిషేధించాయి.
ఆ కాలంలో టీవీ, రేడియోల్లో నిషేధం పడితే సినిమా కలెక్షన్లు దెబ్బతింటాయని భావించేవారు. కానీ, విచిత్రంగా ఈ వివాదం 'విధాత' సినిమాకు భారీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. థియేటర్లలో ఈ పాటను, ఆ నృత్యాలను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.
1982లో అత్యధిక వసూళ్లు సాధించి
ఫలితంగా 1982లో అత్యధిక వసూళ్లు సాధించిన అతిపెద్ద హిట్ చిత్రాల్లో ఒకటిగా 'విధాత' నిలిచింది. కాలక్రమేణా ఈ పాటలోని వివాదాలు పక్కకు పోయి, కిశోర్ కుమార్ కెరీర్లోనే ఒక అరుదైన మైలురాయిగా, ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన గీతంగా నిలిచిపోయింది.