ఓటీటీలోకి కుబేర.. కోట్లు కొల్లగొట్టిన మూవీ స్ట్రీమింగ్ డేట్ పై లేటెస్ట్ బజ్.. డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?
బాక్సాఫీస్ ను షేక్ చేసిన కుబేర మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం త్వరలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుందని తెలిసింది.
బిచ్చగాడి పాత్రలో ధనుష్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నాగార్జున కలిసి అదరగొట్టిన సినిమా ‘కుబేర’. ఈ మూవీ థియేటర్లలో సత్తాచాటింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కుబేర మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం త్వరలోనే ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏ ఓటీటీలోకి?
సూపర్ హిట్ మూవీ కుబేర ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ ఓటీటీలోనే కుబేర మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రైమ్ వీడియో సుమారు రూ.50 కోట్లు ఖర్చు పెట్టిందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల దుమ్ము రేపిన కుబేర ఓటీటీ రైట్స్ కోసం డిమాండ్ నెలకొన్నప్పటికీ ప్రైమ్ వీడియో హక్కులు దక్కించుకున్నట్లు తెలిసింది.
ఆ రోజేనా?
కుబేర సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ కలెక్షన్లు ఇప్పటికే రూ.150 కోట్లు దాటేశాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. రెండు తేదీలు వినిపిస్తున్నాయి. జూలై 18 లేదా జూలై 20న ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. మరి ఈ రెండింట్లో ఏ డేట్ లాక్ చేస్తారో చూడాలి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
శేఖర్ సత్తా
ఫీల్ గుడ్ సినిమాలు తీస్తారని డైరెక్టర్ శేఖర్ కమ్ములకు పేరుంది. ఆయన కొత్త ప్రయోగంతో రూపొందించిన మూవీ కుబేర. లక్ష కోట్ల స్కామ్ చూట్టూ సాగే కథ ఇది. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున మాజీ సీబీఐ ఆఫీసర్ గా నటించారు. లక్ష కోట్ల స్కామ్ చేసే విలన్ నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్)కు హెల్ప్ చేసే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నాగార్జున ఇరగదీశారు. చివర్లో తన యాక్టింగ్ లో వైవిధ్యాన్ని చూపించారు.
రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా సాంగ్స్, బీజీఎం మరో లెవల్ లో ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పై ఈ మూవీని సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, అజయ్ నిర్మించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



