...
...
Next Story

Asha Bhosle Dance: 91 ఏళ్ల వయసులో తన చివరి షోలో ఆశా డ్యాన్స్.. తౌబా తౌబా అంటూ ఉర్రూతలూగించిన లెజెండరీ సింగర్

Asha Bhosle Dance: ఆశా భోంస్లే లెజెండరీ సింగరే కాదు.. గొప్ప ఎంటర్టైనర్ కూడా. ఆమె తన చివరి స్టేజ్ షోలో 91 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.

Published on: Apr 12, 2026, 21:00:46 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Asha Bhosle Dance: ఇండియన్ సినిమా సంగీత శిఖరం, తన గాత్రంతో ఎన్నో తరాలను ఉర్రూతలూగించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే (92) కన్నుమూసిన విషయం తెలుసు కదా. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె తాను ఇచ్చిన చివరి షోలో 91 ఏళ్ల వయసులో తౌబా తౌబా పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

'తౌబా తౌబా' స్టెప్పులతో హోరెత్తించిన చివరి ప్రదర్శన

Asha Bhosle Dance: 91 ఏళ్ల వయసులో తన చివరి షోలో ఆశా డ్యాన్స్.. తౌబా తౌబా అంటూ ఉర్రూతలూగించిన లెజెండరీ సింగర్
Asha Bhosle Dance: 91 ఏళ్ల వయసులో తన చివరి షోలో ఆశా డ్యాన్స్.. తౌబా తౌబా అంటూ ఉర్రూతలూగించిన లెజెండరీ సింగర్

వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ.. 91 ఏళ్ల వయసులో కూడా ఆశా భోంస్లే ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆమె చివరిసారిగా 2024 డిసెంబర్ 29న దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో ‘ఆశా భోంస్లే & సోనూ నిగమ్ లెగసీ కన్సర్ట్’లో ప్రదర్శన ఇచ్చారు.

ఆ వేదికపై ఆమె పాడిన పాటలకంటే, ఇటీవల సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ‘తౌబా తౌబా’ పాటకు ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. విక్కీ కౌశల్ వైరల్ హుక్ స్టెప్‌ను ఆమె రీక్రియేట్ చేయడంతో ఆ వీడియో అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. "చిన్న గ్రామం నుంచి వచ్చిన నాలాంటి కుర్రాడు రాసిన పాటకు సంగీత దేవత ఆశా జీ డ్యాన్స్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని గౌరవం," అని గాయకుడు కరణ్ ఔజ్లా అప్పట్లో భావోద్వేగానికి లోనయ్యారు.

లతాజీ నీడ నుంచి స్వయంప్రకాశం వరకు..

అగ్రగామి గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రయాణం మొదలుపెట్టిన ఆశా భోంస్లే, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. లతాజీ గొంతులో ఉండే గాంభీర్యం ఒకటైతే, ఆశాజీ గొంతులో ఉండే మాధుర్యం, చమత్కారం, వైవిధ్యం మరొకటి.

ఆశా భోంస్లే పాటల్లో ‘దమ్ మారో దమ్’, ‘పియా తూ అబ్ తో ఆజా’, ‘ఆవో నా గలే లాగ్ జావో నా’, ‘ఇన్ ఆంఖోన్ కీ మస్తీ’ వంటివి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డును గెలుచుకున్నారు. 'ఉమ్రావ్ జాన్' (దిల్ చీజ్ క్యా హై), 'ఇజాజత్' (మేరా కుచ్ సామాన్) చిత్రాలకు గాను రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది.

శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు

ఆశా భోంస్లే మరణవార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శనార్థం సోమవారం ఉదయం 11 గంటలకు ఆమె నివాసం (కాసా గ్రాండే, లోయర్ పరేల్) వద్ద ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఆశా భోంస్లే ఎప్పుడు, ఎక్కడ మరణించారు?

ఆశా భోంస్లే ఏప్రిల్ 12, 2026 ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.

2. ఆమె చేసిన చివరి ప్రదర్శన ఏది?

2024 డిసెంబర్ 29న దుబాయ్‌లో సోనూ నిగమ్‌తో కలిసి నిర్వహించిన 'లెగసీ కన్సర్ట్' ఆమె చివరి భారీ స్టేజ్ షో. ఇందులో ఆమె 'తౌబా తౌబా' పాటకు స్టెప్పులేసి వార్తల్లో నిలిచారు.

3. ఆశా భోంస్లేకు వచ్చిన ప్రధాన అవార్డులేవి?

ఆమె రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు భారత అత్యున్నత పురస్కారాలైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe