...
...
Next Story

మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా?

మహాభారతంలో కర్ణుడి పాత్ర పోషించిన పంకజ్ ధీర్ క్యాన్సర్ తో పోరాడుతూ బుధవారం (అక్టోబర్ 15) కన్నుమూశాడు. అయితే ఈ సీరియల్ లో మొదట అర్జునుడి పాత్ర పోషించాల్సిన అతడు.. తర్వాత కర్ణుడి పాత్రకు ఎలా మారాడన్నది ఆసక్తి రేపేదే.

Published on: Oct 15, 2025, 16:07:55 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్‌లో కర్ణుడి క్యారెక్టర్ చేసిన టీవీ యాక్టర్ పంకజ్ ధీర్ ఈరోజు అంటే అక్టోబర్ 15న చనిపోయాడు. పంకజ్ ధీర్ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. పంకజ్ చాలా టాలెంటెడ్ యాక్టర్. అతడు తన కెరీర్‌లో చాలా మంచి క్యారెక్టర్లు చేశాడు. కానీ అతనికి అసలు పేరు వచ్చింది మాత్రం కర్ణుడి రోల్ ద్వారానే. ఆ రోల్ ఎంత పాపులర్ అయ్యిందంటే పుస్తకాల్లో కర్ణుడి బొమ్మల దగ్గర కూడా పంకజ్ ధీర్ ఫేస్ వేసేవాళ్లు. అయితే నిజానికి మొదట అతనికి అర్జునుడి పాత్ర ఇచ్చారన్న విషయం తెలుసా?

మీసాలు తీయనని అనడంతో..

మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా? (Instagram)
మీసాలు మాత్రం తీయను అన్నాడు.. దీంతో అర్జునుడి పాత్ర పోయి కర్ణుడి పాత్ర వచ్చింది: కన్నుమూసిన పంకజ్ ధీర్ స్టోరీ తెలుసా? (Instagram)

మహాభారత్ సీరియల్ లో మొదట పంకజ్ ధీర్ ను అర్జునుడి పాత్ర కోసం ఆడిషన్ చేశారట. కానీ అతడు మీసాలు తీయడానికి ఒప్పుకోలేదు. దానివల్ల అతనికి ఆ రోల్ దొరకలేదు. గతంలో ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో పంకజ్ ధీర్ ఈ విషయం గురించి మాట్లాడాడు. అందులో పంకజ్ ఏమన్నారంటే.. “నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు డైలాగ్ రైటర్స్ రాహీ మాసూమ్ రజా, భృంగ్ తుప్కరీ సాహెబ్ పండిట్ నరేంద్ర శర్మతో కలిసి ఒక ప్యానెల్ ఉండేది. వాళ్ళందరూ నేను అర్జునుడి రోల్‌లో చాలా బాగుంటానని అనుకున్నారు.

మేము దాని గురించి మాట్లాడుకుని నేను కాంట్రాక్ట్ సైన్ చేశాను. తర్వాత బీఆర్ చోప్రా నాకు ఫోన్ చేసి బృహన్నల క్యారెక్టర్ కోసం మీసాలు కత్తిరించుకోవాలి అన్నారు. నేను అది చేయలేను అన్నాను. నా ముఖం బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటే నేను మీసాలు తీసేస్తే నా ఫేస్ బాగుండదు అని చెప్పాను. దానికి ఆయన నాతో.. నువ్వు యాక్టర్ వా కదా.. నువ్వు మీసాల కోసం ఇంత పెద్ద రోల్ వదిలేస్తున్నావు. నాకు ఇది అర్థం కావడం లేదు అన్నాడు” అని పంకజ్ తెలిపాడు.

కర్ణుడి రోల్ ఇలా దొరికింది

మళ్ళీ చోప్రా సర్ నాకు కాల్ చేశారు. దీన్నే నేను అదృష్టం అంటాను. ఆయన నన్ను కర్ణుడి రోల్ చేస్తావా అని అడిగారు? నేను.. సర్ మీసాలు కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు కదా అని అడిగాను. ఆయన లేదు అన్నారు. నాకు కర్ణుడి రోల్ దొరకడం నా అదృష్టం” అని పంకజ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. పంకజ్ ఇప్పుడు 68 ఏళ్ల వయసులో కన్నుమూసినా.. ఆ కర్ణుడి పాత్రలో ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe