వారణాసి టైటిల్ కార్డులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పేర్లు మిస్సింగ్.. ఇదే కారణమంటున్న ఫ్యాన్స్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఈ టైటిల్ కార్డ్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ పేర్లు మిస్ అయ్యాయి.
వారణాసి టైటిల్ టీజర్ దుమ్మురేపుతోంది. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై హైప్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది. శనివారం (నవంబర్ 15) హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రం టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

వారణాసి టైటిల్ కార్డు
గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వారణాసి టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు చిత్రంలోని ప్రధాన తారలు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరయ్యారు. అయితే చిత్రంలోని నటీనటుల పేర్లు టైటిల్ పోస్టర్లో లేవని, సాంకేతిక నిపుణుల పేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తాజాగా ఆడియన్స్ గుర్తించారు. రాజమౌళి ఇలా ఎందుకు చేశారోననే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వీళ్ల పేర్లు
శనివారం రాత్రి చిత్ర టైటిల్తో పాటు ఎస్ఎస్ రాజమౌళి దాని ఫస్ట్ లుక్ను కూడా ఆవిష్కరించారు. ఇది ఖండాలు, శతాబ్దాల పాటు విస్తరించి ఉన్న సినిమా ప్రపంచాన్ని, నేపథ్యాన్ని పరిచయం చేసింది. మొదట్లో గ్లోబ్ ట్రాటర్ అని పిలిచిన ఈ సినిమాకు అధికారికంగా 'వారణాసి'గా టైటిల్ పెట్టారు. 3 నిమిషాల నిడివి గల వీడియో చివరలో టైటిల్ రివీల్ అవుతుంది. అందులో ఎస్ఎస్ రాజమౌళి ‘వారణాసి' అని రాసి ఉంది.
దాని కింద నిర్మాతలు, రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఇతర సాంకేతిక నిపుణుల పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా మహేష్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్ అనే ముగ్గురు నటీనటుల పేర్లు ఈ జాబితాలో లేవు.

ఆశ్చర్యంగా ఉందని
నటీనటుల పేర్లు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఒక రెడ్డిట్ పోస్ట్లో 'ఆసక్తికరంగా! క్రెడిట్ కార్డు చివరలో ఏ నటీనటుల పేరును ఎందుకు ప్రస్తావించలేదు? ఏదైనా టైటిల్ పైన ప్రధాన నటీనటుల పేర్లు ఉంటాయని మేము ఎప్పుడూ చూస్తాము, కానీ ఏ నటీనటుల పేర్లను కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది' అని ఒకరు ప్రశ్నించారు.
ఇదే రీజన్
ఎస్ఎస్ రాజమౌళి అభిమానులకు దర్శకుడు బాహుబలి నుండే ఈ ఫార్మాట్ను ఉపయోగిస్తున్నాడని తెలుసు. ఒక అభిమాని ఇలా వివరించారు.. 'ఇవి పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి, పోస్టర్లో ఏ నటుడి పేరును చేర్చరు. ఎందుకంటే ప్రేక్షకులు సినిమాలోని పాత్రలను పోస్టర్ చూసినప్పుడు గుర్తుంచుకునేలా సినిమా ప్రపంచాన్ని సెట్ చేయాలనుకుంటారు. అలాగే పరిచయ సన్నివేశాలలో కూడా ఎలాంటి ట్యాగ్లు లేదా పేర్లు చేర్చలేదు. సినిమా దాని ప్రపంచంలోనే ఉంటుంది. అందుకే బాహుబలి 1, 2, RRR నుండి సినిమా చివరలో నటీనటుల పేర్లను చేర్చుతున్నాడేమో’’ అని చెప్పుకొచ్చాడు.
సినిమానే గొప్పదని
'రాజమౌళి సినిమాల్లో సాధారణంగా పోస్టర్పై నటీనటుల పేర్లు ఉండవు. నటుల కంటే సినిమానే గొప్పదని ఆయన ఆలోచన' అని మరో అభిమాని రాసుకొచ్చాడు. చాలా మంది గ్లోబల్ ప్రేక్షకులు.. స్టార్డమ్ ఉన్నప్పటికీ, నటీనటుల కంటే రాజమౌళినే సినిమానే బ్రాండ్ అని కూడా గుర్తించారు. 'నటీనటులలో అతిపెద్ద సూపర్ స్టార్ రాజమౌళి, మహేష్ బాబు కాదు. మొత్తం నిర్మాణ భారం మహేష్ బాబు లేదా ప్రియాంక లేదా పృథ్వీరాజ్ కాకుండా రాజమౌళి బ్రాండ్పైనే ఉంది' అని ఒకరు వాదించారు.
వారణాసి గురించి..
వారణాసిలో మహేష్ బాబు రుద్రగా నటిస్తున్నారు. శనివారం టైటిల్ టీజర్తో పాటు, వారణాసి వీధుల్లో ఎద్దుపై స్వారీ చేస్తున్న నటుడి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. పేరు మినహా పాత్ర గురించి ఎక్కువ చెప్పలేదు. అదేవిధంగా ప్రియాంక మందాకినిగా, తుపాకీ పట్టుకుని చీరకట్టుకున్న కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ ఈ చిత్రానికి విలన్ అయిన కుంభగా నటిస్తున్నాడు. ఈ మూవీ 2027 సమ్మర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


