మలయాళ నటి అన్ను ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మెమరీ ప్లస్' (Memory Plus). 2024 ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ మలయాళ ఓటీటీ ప్లాట్ఫామ్ మనోరమ మ్యాక్స్ లో జనవరి 9 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
మెమొరీ ప్లస్ మూవీ విశేషాలు

ఏడాదిన్నర కిందటే థియేటర్లలో రిలీజైన ఈ మెమొరీ ప్లస్ మూవీలో అన్ను ఆంటోనీ, అనీష్ జి మీనన్, స్మిను సిజో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, బాధ, గాయాలు, తమను తాము తెలుసుకునేందుకు ఓ తల్లీకూతుళ్లు చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 50 లక్షలలోపే వసూలు చేసింది. ఈ మెమొరీ ప్లస్ సినిమాను కె.టి. మన్సూర్ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉంది.
మనోరమ మ్యాక్స్లో ఇతర మలయాళం మూవీస్
ఈ మనోరమ మ్యాక్స్ ఓటీటీ ఇటీవల మరికొన్ని కొత్త సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో పూవు అతనే మూవీ ఒకటి. ఇది జీవన్ అనే మధ్యవయస్కుడి కథ. తన జీవితంపై ప్రభావం చూపిన నలుగురు స్త్రీలతో అతను చేసే ప్రయాణం ఇది.
ఇక అప్పురమ్ అనేది మరో మూవీ. ఇది కఠినమైన ఆచారాలు ఉన్న ఇంట్లో, మానసిక అనారోగ్యంతో ఉన్న తల్లితో పెరిగే ఒక యువతి కథ. ఇవే కాకుండా సర్కీట్, కరమ్, ఫెమినిచి ఫాతిమా, షేడ్స్ ఆఫ్ లైఫ్, అతిభీకర కాముకన్ కూడా మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సన్ నెక్స్ట్లో 'నిధియుమ్ భూతవుమ్'
'మెమరీ ప్లస్' నటుడు అనీష్ జి మీనన్ నటించిన మరో లేటెస్ట్ సినిమా 'నిధియుమ్ భూతవుమ్' (Nidhiyum Bhoothavum) ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు మెకానిక్ ఫ్రెండ్స్ ఒక గెస్ట్ హౌస్లో దిగుతారు. స్థానికులు అది దెయ్యాల కొంప అని చెబుతారు. అక్కడ వీరికి ఎదురైన వింత అనుభవాలు, దాని వల్ల వచ్చే నవ్వులే ఈ సినిమా.
{{/usCountry}}'మెమరీ ప్లస్' నటుడు అనీష్ జి మీనన్ నటించిన మరో లేటెస్ట్ సినిమా 'నిధియుమ్ భూతవుమ్' (Nidhiyum Bhoothavum) ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు మెకానిక్ ఫ్రెండ్స్ ఒక గెస్ట్ హౌస్లో దిగుతారు. స్థానికులు అది దెయ్యాల కొంప అని చెబుతారు. అక్కడ వీరికి ఎదురైన వింత అనుభవాలు, దాని వల్ల వచ్చే నవ్వులే ఈ సినిమా.
{{/usCountry}}