మలయాళం సినిమాలకు తెలుగులో క్రమంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. కానీ అక్కడి ఇండస్ట్రీ మాత్రం నష్టాల ఊబిలో నుంచి బయటపడటం లేదు. 2025లోనూ అక్కడి మూవీ ఇండస్ట్రీ కష్టాలు కొనసాగినట్లు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది.
బ్లాక్బస్టర్లు వచ్చినా తప్పని కష్టాలు

నిజానికి 2025లో మలయాళ సినిమా ఇండస్ట్రీ చరిత్ర సృష్టించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా' సినిమా ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది. మోహన్లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ కూడా బాగానే రాణించాయి. కానీ ఓవరాల్గా చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఏడాది విడుదలైన 184 సినిమాల్లో హిట్స్ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. దీంతో నిర్మాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు.
కేవలం 10 హిట్సేనా?
మలయాళ చిత్ర పరిశ్రమ 2025లో ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. కానీ తెర వెనుక పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) బయటపెట్టిన గణాంకాలు ఇండస్ట్రీని షాక్కు గురిచేస్తున్నాయి.
ఈ ఏడాది మలయాళంలో మొత్తం 184 సినిమాలు విడుదల కాగా.. అందులో విజయవంతమైనవి 10 కంటే తక్కువే ఉన్నాయి. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం. ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం తక్షణం స్పందించి 'ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్' రద్దు చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో జనవరి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే KSFDC థియేటర్లను బాయ్ కాట్ చేయాలని ఛాంబర్ నిర్ణయించింది. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
2025 టాప్ గ్రాసర్స్
మలయాళం సినిమా ఇండస్ట్రీ గతేడాది కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ ఏడాది కొన్ని బ్లాక్బస్టర్లు వచ్చినా ఓవరాల్గా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అయితే ఫ్లాపులు ఎన్ని ఉన్నా.. టాప్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేశాయి.
{{/usCountry}}మలయాళం సినిమా ఇండస్ట్రీ గతేడాది కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ ఏడాది కొన్ని బ్లాక్బస్టర్లు వచ్చినా ఓవరాల్గా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అయితే ఫ్లాపులు ఎన్ని ఉన్నా.. టాప్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ను షేక్ చేశాయి.
{{/usCountry}}కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో, దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన లోకా: ఛాప్టర్ 1 చంద్ర సినిమా రూ. 303.86 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో 300 కోట్ల క్లబ్లో చేరడం ఇదే తొలిసారి.
ఇక మోహన్లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ఎల్2: ఎంపురాన్ రూ. 266.81 కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. మోహన్లాల్ నటించిన మరో మూవీ తుడరుమ్ కూడా రూ. 235.38 కోట్లు వసూలు చేసింది.
అయితే ఈ సినిమాలు తప్ప మిగతా వాటిలో పెద్దగా చెప్పుకోదగిన వసూళ్లు సాధించలేకపోయాయి. చాలా వరకు మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది.