...
...
Next Story

OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే షూటింగ్.. మైండ్ బ్లాక్‌ చేసే క్లైమాక్స్.. ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ చూశారా?

OTT Horror Thriller: ఓటీటీలో ఓ మైండ్ బెండింగ్ మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా పేరు చురుళి. 2021లో వచ్చిన ఈ మూవీని కొందరు ఇండియాలో వచ్చిన బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగానే అభివర్ణించారు. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Published on: Jul 30, 2026, 14:45:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే అత్యంత రహస్యంగా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులను పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ హారర్ థ్రిల్లర్ 'చురుళి' (Churuli). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో (SonyLIV) స్ట్రీమింగ్ అవుతున్న ఈ మైండ్ బెండింగ్ సైకలాజికల్ మిస్టరీ డ్రామా, వీకెండ్‌లో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే మూవీ లవర్స్‌కి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. 7 ఐఎండీబీ రేటింగ్‌ సాధించిన ఈ సినిమా.. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి క్లైమాక్స్ వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది.

19 రోజుల్లోనే షూటింగ్.. కేరళ అడవుల్లో వింత ప్రపంచం

OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే షూటింగ్.. మైండ్ బ్లాక్‌ చేసే క్లైమాక్స్.. ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ చూశారా?
OTT Horror Thriller: కేవలం 19 రోజుల్లోనే షూటింగ్.. మైండ్ బ్లాక్‌ చేసే క్లైమాక్స్.. ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ చూశారా?

హారర్ థ్రిల్లర్ చురుళి సినిమా వెనుక ఉన్న నిర్మాణ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు రాకంటే ముందే కేరళలోని ఇడుక్కి జిల్లా కులమావు దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఎటువంటి కృత్రిమ సెట్లు వేయకుండా, కేవలం రియల్ లొకేషన్లలో అత్యంత సీక్రెట్ గా ఈ ప్రాజెక్ట్‌ను ముగించారు. ఎవరికీ తెలియకుండా కేవలం 19 రోజుల్లోనే ప్రొడక్షన్ పూర్తి చేసి, విజువల్ వండర్‌గా మార్చడం మేకర్స్ ప్రతిభకు నిదర్శనం.

సాధువు, దెయ్యం కథతో ప్రారంభం.. అండర్‌కవర్ పోలీసుల వేట

సినిమా ప్రారంభంలో ఒక సాధువు, అడవిలోని దెయ్యం మధ్య సాగే జానపద కథను వాయిస్ ఓవర్‌లో వినిపిస్తారు. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. ఆంటోనీ, షాజీవన్ అనే ఇద్దరు అండర్‌కవర్ పోలీసులు జాయ్ అనే పరారీలో ఉన్న ప్రమాదకర నేరస్థుడిని పట్టుకోవడానికి 'చురుళి' అనే మారుమూల గ్రామానికి ప్రయాణమవుతారు. ఆ ఊరిలోకి అడుగుపెట్టడానికి ఒక చెక్క వంతెన దాటాల్సి ఉంటుంది. వంతెన దాటి లోపలికి వెళ్లిన తర్వాత పోలీసులకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి.

ఊరి జనం విచిత్ర ప్రవర్తన.. సుడిగుండంలో చిక్కుకున్న నిజాలు

మలయాళ ఇండస్ట్రీలో 'జల్లీకట్టు', 'అంగమలై డైరీస్', 'నన్ పకల్ నేరత్తు మయక్కమ్' లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసిన జీనియస్ డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సేరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వినయ్ ఫోర్ట్, చెంబన్ వినోద్ జోస్, జోజు జార్జ్, జాఫర్ ఇడుక్కి తమ నటనా విశ్వరూపం చూపించారు.

డార్క్ కలర్ టోన్, భయపెట్టే సింగిల్ టేక్ కెమెరా షాట్లు, గూస్ బంప్స్ తెప్పించేలా ఉండే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ డిజైన్ ఈ సినిమాను వరల్డ్ క్లాస్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.

మైండ్ తిరిగే క్లైమాక్స్.. ఎందుకు చూడాలి

ఈ సినిమా ముగింపు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. సైన్స్ ఫిక్షన్, కాల చక్రం (Time Loop), జానపద నమ్మకాలు, మానవ నైజాన్ని మిక్స్ చేసి డైరెక్టర్ ఇచ్చిన క్లైమాక్స్ ప్రేక్షకులను తీవ్రమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సస్పెన్స్, హారర్, మిస్టరీ కాన్సెప్ట్‌లను ఇష్టపడే ఓటీటీ ప్రియులు సోనీ లివ్‌లో లభ్యమవుతున్న ఈ మలయాళం కల్ట్ క్లాసిక్‌ను అస్సలు మిస్ కాకూడదు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ హాయిగా ఇంట్లో కూర్చొని ఈ మూవీని చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe