ఓటీటీలోకి మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రైలర్ రిలీజ్.. నిజ జీవిత ఘటనల ఆధారంగా..

ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు ఫార్మా. మలయాళ స్టార్ నటుడు నివిన్ పౌలీ నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. తాజాగా గురువారం (డిసెంబర్ 11) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.

Published on: Dec 11, 2025 3:24 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. మలయాళంలో రూపొందిన ఈ సిరీస్ ను తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా గురువారం (డిసెంబర్ 11) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్ ఓ మెడికల్ మాఫియాకు ఎలా ఎదురు తిరిగాడన్న ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

ఓటీటీలోకి మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రైలర్ రిలీజ్.. నిజ జీవిత ఘటనల ఆధారంగా..
ఓటీటీలోకి మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రైలర్ రిలీజ్.. నిజ జీవిత ఘటనల ఆధారంగా..

ఫార్మా వెబ్ సిరీస్ ట్రైలర్

ఫార్మా వెబ్ సిరీస్ వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కేపీ వినోద్ అనే ఓ మెడిల్ రెప్ చుట్టూ తిరిగే కథ ఇది. మొదట తన ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి అతడు పడే బాధలను ఫన్నీగా చూపించిన ఈ ట్రైలర్.. తర్వాత అసలు కథలోకి వెళ్లింది. ఆ చిన్న ఉద్యోగే క్రమంగా ఎదిగి.. ఓ పెద్ద మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఇందులో చూడొచ్చు.

ఫార్మా వెబ్ సిరీస్ గురించి..

'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ స్టార్ నివిన్ ఫౌలీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. మంగళవారం (డిసెంబర్ 9) జరిగిన జియోహాట్‌స్టార్ 'సౌత్ అన్‌బౌండ్' ఈవెంట్‌లో ఈ ఫార్మా వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

'ఫార్మా' అనేది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే మెడికల్ డ్రామా. ఇందులో నివిన్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సిరీస్ గురించి నివిన్ ఎమోషనల్ అయ్యాడు.

"ఈ సిరీస్ థీమ్ పిల్లల గురించి.. వారి జీవితం, వారి భవిష్యత్తు గురించి. ఇది నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడే కథ. స్క్రిప్ట్‌లో చాలా విలువలు ఉన్నాయి. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, అంతకు మించి. ప్రతి కుటుంబం తప్పక చూడాల్సిన సిరీస్ ఇది" అని నివిన్ చెప్పుకొచ్చాడు.

25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు రజిత్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 90వ దశకంలో (1999) నటి శోభనతో కలిసి నటించిన అతడు.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళ ఇండస్ట్రీకి తిరిగి వస్తున్నాడు. "స్క్రిప్ట్ వినగానే వెంటనే ఓకే చెప్పేశాను. ఒక నటుడిగా నా ఇన్‌స్టింక్ట్‌ను నమ్మాను" అని రజిత్ అన్నాడు.

పి.ఆర్. అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫార్మా వెబ్ సిరీస్‌లో నరేన్, శృతి రామచంద్రన్, వీణా నందకుమార్, ముత్తుమణి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫార్మా వెబ్ సిరీస్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.