OTT Malayalam: దేవుడే మనిషి సాయం కోరితే.. ఓటీటీలోకి 9 నెలల తర్వాత వస్తున్న మలయాళం మూవీ.. ఐఎండీబీలో 7.1 రేటింగ్
OTT Malayalam: ఓటీటీలోకి సుమారు 9 నెలల తర్వాత ఓ మలయాళం మూవీ వస్తోంది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. దీనికి ఐఎండీబీలో 7.1 రేటింగ్ ఉంది.
మలయాళ సినిమా 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్' (Written & Directed by God) ఎట్టకేలకు తన ఓటీటీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసింది. సైజు కురుప్, సన్నీ వేన్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు ఫెబీ జార్జ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మార్చి 20న మనోరమ మ్యాక్స్ (Manorama Max) ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఐఎండీబీలో 7.1 రేటింగ్ నమోదైనా.. థియేటర్లలో మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత..
గతేడాది (2025) జూన్లో థియేటర్లలోకి వచ్చిన మలయాళం మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్. దాదాపు తొమ్మిది నెలల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై అడుగుపెట్టబోతోంది. ఈ శుక్రవారం (మార్చి 20) నుంచి ఈ మూవీ తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని మనోరమ మ్యాక్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికైతే మార్చి 20న మరే ఇతర మలయాళ సినిమా రిలీజ్ కావట్లేదు. కానీ జీ5 (Zee5) లో మాత్రం 'కాసరగోడ్ ఎంబసీ' (Kasaragod Embassy) అనే మలయాళ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్' మూవీ అటు ఆడియన్స్ను, ఇటు క్రిటిక్స్ను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. మరి సైజు కురుప్ నటించిన ఈ మూవీ, డిజిటల్ స్పేస్లో అయినా ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేస్తుందా లేదా అనేది చూడాలి.
అసలు కథ ఏంటంటే..
టైటిల్ చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది కదా.. ఈ మలయాళ సినిమా ఒక ఫిల్మ్ మేకర్కు, దేవుడికి మధ్య జరిగిన ఎన్కౌంటర్ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ విసిగించే భార్యతో విసిగిపోయి, కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న ఒక ఫిల్మ్ మేకర్ 'జిజో' క్యారెక్టర్లో సైజు కురుప్ నటించాడు. ఆ టైమ్లో అతనికి అనుకోకుండా సాక్షాత్తూ ఆ దేవుడే ఎదురుపడతాడు. అంతేకాదు కొత్త వాళ్లకు సహాయం చేయడం కోసం ఆ దేవుడు జిజో హెల్ప్ అడుగుతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జిజో లైఫ్పై, తన ఫ్యామిలీపై ఉన్న దృక్పథం పూర్తిగా ఎలా మారిపోయింది అనేదే ఈ ఫాంటసీ కథ.
ఈ సినిమాలో దేవుడి క్యారెక్టర్లో సన్నీ వేన్ అద్భుతంగా నటించాడు. అలాగే అపర్ణా దాస్, దినేష్ ప్రభాకర్, బిబిన్ జార్జ్, నీనా కురుప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫాంటసీ, కామెడీ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా స్టోరీని జోమన్ జాన్, లింటో దేవస్యా, రోషన్ మాథ్యూ కలిసి రాశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


