...
...
Next Story

ప్రతి ముఖంలోనూ తన లవరే కనిపిస్తే.. ఓటీటీలోకి మలయాళం సైకో థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.9 రేటింగ్

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా పేరు ఫేసెస్. వచ్చే వారమే సన్ నెక్ట్స్ లో ఐదు భాషల్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

Published on: May 22, 2026, 21:59:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి సన్ నెక్స్ట్ (Sun NXT) ఓ సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌ను మన ముందుకు తీసుకొస్తోంది. అదే 'ఫేసెస్' (Faces). ప్రేమ, సస్పెన్స్, మానసిక సంఘర్షణల చుట్టూ సాగే ఈ సినిమా కథాంశం ఇప్పుడు డిజిటల్ వీక్షకుల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.

ప్రియుడి కోసం యువతి అన్వేషణ

ప్రతి ముఖంలోనూ తన లవరే కనిపిస్తే.. ఓటీటీలోకి మలయాళం సైకో థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.9 రేటింగ్
ప్రతి ముఖంలోనూ తన లవరే కనిపిస్తే.. ఓటీటీలోకి మలయాళం సైకో థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.9 రేటింగ్

ఈ ఫేసెస్ మూవీ కథ విషయానికి వస్తే.. నిత్య, మైఖేల్ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో మైఖేల్ ఉన్నట్లుండి మాయం అవుతాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అతను ఎక్కడికి వెళ్లాడో, ఏమయ్యాడో ఎవరికీ అర్థం కాదు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కళ్ల ముందు లేకపోవడంతో నిత్య తీవ్ర మానసిక క్షోభకు గురవుతుంది.

ఆ ఒత్తిడికి క్రమంగా ఆమె పీటీఎస్‌డీ (PTSD - పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) బారిన పడుతుంది. ఈ క్రమంలో ఆమె మానసిక స్థితి ఎంతలా దిగజారుతుందంటే.. దారిలో కనిపించే ప్రతి గుర్తు తెలియని వ్యక్తిలోనూ తన ప్రియుడే కనిపిస్తుంటాడు. చుట్టూ ఉన్న అందరి ముఖాల్లో మైఖేల్ రూపాన్నే చూస్తూ పిచ్చిదానిలా మారిపోతుంది.

అసలు మైఖేల్ ఏమయ్యాడు? ఈ మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? తన మానసిక సమస్యలతో పోరాడుతూనే ప్రియుడి ఆచూకీని నిత్య ఎలా కనిపెట్టింది? అనే ఆసక్తికర అంశాలతో ఈ కథ నడుస్తుంది. సినిమా మొత్తం నిత్య కోణం నుంచే సాగుతుంది.

ప్రేమ వెనుక దాగున్న రహస్యాలు ఏంటి?

"ప్రేమ ఎంతో అందంగా కనిపించింది.. ఆ రహస్యాలు బయటపడే వరకు" అని సన్ నెక్స్ట్ ఈ సినిమాకు ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే.. కథలో మైండ్ బ్లాంక్ అయ్యే మలుపులు ఉన్నాయని స్పష్టమవుతోంది. కలేష్ రామానంద్, హన్నా రెజి కోషి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

రొమాంటిక్ సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మలయాళం మూవీ మే 29 నుంచి సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతున్నట్లు సన్ నెక్ట్స్ వెల్లడించింది. ఈ వీకెండ్‌లో మంచి ఎమోషనల్ మిస్టరీ డ్రామా చూడాలనుకునే వారికి ఈ 'ఫేసెస్' సినిమా కచ్చితంగా మంచి ఆప్షన్ అవుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ఫేసెస్ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది?

సైకో థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT)లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఫేసెస్ సినిమా స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు?

మే 29 నుంచి ఈ తెలుగు సహా వివిధ భాషల్లో ఈ సినిమా ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఫేసెస్ సినిమా మెయిన్ స్టోరీ ఏంటి?

తన బాయ్‌ఫ్రెండ్ మిస్ అవ్వడంతో పీటీఎస్‌డీ (PTSD) బారిన పడిన ఓ యువతి కథ ఇది. ఎదురుగా కనిపించే ప్రతి వ్యక్తిలోనూ ఆమెకు తన ప్రియుడి ముఖమే కనిపిస్తుంటుంది. ఆ మానసిక వేదనతోనే ఆమె మిస్టరీని ఎలా ఛేదించిందన్నదే కథ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe