టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వెలుపల ఒక ఆసక్తికర సీన్ కనిపించింది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసెఫ్ (పొన్మ్యాన్ ఫేమ్) ఒక సామాన్య క్రికెట్ అభిమానిలా మారిపోయి సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్డు పక్కన సంజూ శాంసన్ జెర్సీ కొని..

స్టేడియం బయట పండుగ వాతావరణం నెలకొన్న వేళ.. మలయాళం స్టార్ బేసిల్ జోసెఫ్ రోడ్డు పక్కన ఉన్న ఒక స్టాల్ దగ్గర ఆగాడు. తన అత్యంత సన్నిహితుడు, భారత క్రికెటర్ సంజూ శాంసన్ పేరు ముద్రించి ఉన్న టీ-షర్ట్ను కొనుగోలు చేశాడు. ఆ జెర్సీని గర్వంగా కెమెరాకు చూపిస్తూ అతడు చిరునవ్వులు చిందించాడు. చుట్టూ ఉన్న యువత అతన్ని గుర్తుపట్టి సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.
అంతేకాకుండా స్టేడియం లోపలికి వెళ్లే ముందు బేసిల్ తన బుగ్గలపై భారత త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేయించుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమయ్యాక, తను కొన్న శాంసన్ జెర్సీని ధరించి టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తున్న ఫోటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
స్టేడియంలో మెరిసిన ప్రముఖులు
ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు నరేంద్ర మోదీ స్టేడియానికి దిగ్గజాలు తరలివచ్చారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండరీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ స్టాండ్స్లో కనిపించి అభిమానులను అలరించారు. బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా గ్యాలరీలో సందడి చేస్తూ కనిపించింది.
మ్యాచ్ హైలైట్స్: భారత్ విశ్వవిజేత
న్యూజిలాండ్తో జరిగిన ఈ ఫైనల్లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.
{{/usCountry}}న్యూజిలాండ్తో జరిగిన ఈ ఫైనల్లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.
{{/usCountry}}బేసిల్ జోసెఫ్ ఎవరి కోసమైతే జెర్సీ కొన్నాడో, అదే సంజూ శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.
256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (4/15) తన అద్భుత బౌలింగ్తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకోగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశారు. భారత్ సాధించిన ఈ అద్భుత విజయం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని నింపింది.