మలయాళం థ్రిల్లర్ మూవీ.. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్తో సర్ప్రైజ్ చేసిన ఓటీటీ
మలయాళం థ్రిల్లర్ మూవీ సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ముందస్తు సమాచారం లేకుండానే తెలుగులోనూ ఈ సినిమాను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం.
ఓటీటీలోకి సుమారు ఏడాది తర్వాత ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ అడుగుపెట్టింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది నటించిన తొలి సినిమా ఇది. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ మూవీ పేరు డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఈ సినిమా స్ట్రీమింగ్ విశేషాలేంటో చూడండి.

డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ ఓటీటీ స్ట్రీమింగ్
మమ్ముట్టి నటించిన డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 19) నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఒరిజినల్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. నిజానికి ఈ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఆ ఓటీటీ ముందుగా వెల్లడించలేదు. సడెన్ గా తెలుగులోనూ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచింది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీ గురించి..
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా 11 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇది 2025 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్ తదితరులు నటించారు. దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. ఈ సినిమాను మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పై స్వయంగా మమ్ముట్టి నిర్మించాడు. డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ మూవీకి క్రిటిక్స్ నుంచి మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి.
దొరికిన ఒక లేడీ పర్స్ ఆధారంగా మిస్సింగ్ కేసును ఎలా దర్యాప్తు చేశారనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కింది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్ గా నటించాడు. గోకుల్ సురేష్ ఏమో డొమినిక్ అసిస్టెంట్ విక్కీగా యాక్ట్ చేశాడు. మాజీ పోలీస్ అధికారి అయిన డొమినిక్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్ గా మారతాడు.
దొరికిన లేడీస్ పర్స్ ఓనర్ ఎవరు అని కనిపెట్టేందుకు డొమినిక్, విక్కీ రంగంలోకి దిగుతారు. ఆ క్రమంలోనే అప్పటికే మిస్సయిన పూజ అనే అమ్మాయితో ఈ పర్స్ కు కనెక్షన్ ఉందని కనిపెడతారు. ఇంకా ఎంక్వైరీ చేస్తుంటే పూజ బాయ్ ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. చివరకు పూజ హత్య విషయం బయటపడుతుంది. ఇక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.
మరి పూజను హత్య చేసింది ఎవరు? కార్తీక్ ఏమయ్యాడు? ఆ ట్విస్ట్ ఏంటీ? అన్నది డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


