మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని హీరోగా చూడటం అలవాటే. కానీ అతనిలోని భయానకమైన విలనిజాన్ని చూడాలంటే ‘కలంకావల్’ (Kalamkaval) చూడాల్సిందే. థియేటర్లలో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్పైకి వచ్చేసింది. సోనీ లివ్, ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక రోజు ముందే ఓటీటీలోకి..

మమ్ముట్టి నటించిన కలంకావల్ సినిమా గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. సుమారు 40 రోజుల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజానికి ఈ సినిమాను జనవరి 16న (శుక్రవారం) ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
కానీ సినిమా కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్కు సర్ప్రైజ్ ఇస్తూ.. ఒక రోజు ముందే, అంటే ఈ రోజే (జనవరి 15) స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. గతంలో ‘రేఖాచిత్రం’, ‘మార్కో’ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో ఈ సినిమా అందుబాటులో ఉంది.
కలంకావల్ మూవీ కథేంటంటే?
డెబ్యూ డైరెక్టర్ జితేన్ కె జోస్ తెరకెక్కించిన మూవీ ఈ కలంకావల్. కేరళ, తమిళనాడులో వరుసగా అదృశ్యమవుతున్న మహిళల మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. పోలీస్ అధికారి జయకృష్ణన్ (వినాయకన్) ఈ కేసుల వెనుక ఏదో ఒక ‘ప్యాటర్న్’ ఉందని గమనిస్తాడు. దర్యాప్తులో ఇదొక సీరియల్ కిల్లర్ పని అని, ఆ కిల్లర్ పేరు స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) అని తేలుతుంది.
పోలీసుల వేట నుంచి తప్పించుకోవడానికి ఆ కిల్లర్ వేసే ఎత్తుగడలు, అతన్ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే సాహసమే ఈ ‘కలంకావల్’. స్లో-బర్న్ థ్రిల్లర్గా సాగే ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
2025లో మమ్ముట్టికి ఏకైక హిట్
మలయాళంలో ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చిన ఘనత మమ్ముట్టికి దక్కుతుంది. కానీ గతేడాది మాత్రం అతనికి పెద్దగా కలిసి రాలేదు. 2025లో మమ్ముట్టి నటించిన ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’, ‘బజూకా’ (ఇంకా ఓటీటీలోకి రాలేదు) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
{{/usCountry}}మలయాళంలో ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చిన ఘనత మమ్ముట్టికి దక్కుతుంది. కానీ గతేడాది మాత్రం అతనికి పెద్దగా కలిసి రాలేదు. 2025లో మమ్ముట్టి నటించిన ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’, ‘బజూకా’ (ఇంకా ఓటీటీలోకి రాలేదు) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
{{/usCountry}}కానీ ‘కలంకావల్’ మాత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో మమ్ముట్టి నటన, జైలర్ ఫేమ్ వినాయకన్ పోలీస్ ఆఫీసర్గా కనబరిచిన ప్రతిభ సినిమాకు హైలైట్. గాయత్రి అరుణ్, రజీషా విజయన్, శ్రుతి రామచంద్రన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్లో ఇదొక బెస్ట్ ఆప్షన్.