OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఘోస్ట్ రైటర్, అమ్మాయి మధ్య బంధం
మలయాళం నుంచి మరో ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమా ‘శేషిప్పు’ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఎక్కడ చూడాలి, కథేంటి, దీని విశేషాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ వారం మరో మలయాళ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూడొచ్చు. ఈ సినిమా పేరు ‘శేషిప్పు’ (Sheshippu). కేరళ ఫిల్మ్ ఫెస్టివల్లో మూవీని ప్రదర్శించిన తర్వాత థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే తీసుకు రావడం విశేషం.

‘శేషిప్పు’ ఆన్లైన్లో ఎక్కడ చూడాలి?
ఈ మలయాళం థ్రిల్లర్ సినిమా శేషిప్పు ఆన్లైన్ అరంగేట్రం వివరాలు ఈ వారం ప్రారంభంలోనే ఖరారయ్యాయి. 2025లో జరిగిన కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFK)లో ఈ సినిమా ప్రదర్శనను మిస్ అయిన వారు.. దీని ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం వేరే ఇతర మలయాళ సినిమాలు ఆన్లైన్లోకి రాలేదు. దీంతో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘శేషిప్పు’ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఈమధ్యే సన్ నెక్స్ట్ (Sun NXT)లో విడుదలైన మలయాళ సినిమాలలో 'ఇత్తిరి నేరం', 'కిర్క్కన్', 'నిధియుమ్ భూతవుమ్' ఉన్నాయి. ఇప్పుడీ శేషిప్పులో ఫిమేల్ లీడ్ గా నటించిన మీనాక్షి జయన్ మరో సినిమా 'విక్టోరియా' థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇంకా ఓటీటీలోకి రాలేదు.
‘శేషిప్పు’ కథ, ఇతర వివరాలు
‘శేషిప్పు’ అనేది ఒంటరితనం, నోస్టాల్జియా చుట్టూ తిరిగే కథ. ఈ సినిమాలో పెద్దగా పేరున్న నటీనటులు లేరు. ఇది కూడా ఈ మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకురావడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.
సినిమాలోని ప్రధాన పాత్ర ఒక ఒంటరి ఘోస్ట్ రైటర్. అతను ఒక మానసిక వేదనలో ఉన్న మహిళను కలుస్తాడు. ఈ ఇద్దరూ ఒకచోట చేరినప్పుడు వారిద్దరి మధ్య ఊహించని బంధం ఏర్పడుతుంది. వారు తమ బాధలను పంచుకోవడం ద్వారా ఒకరికొకరం అనే భావన పొందుతారు.
కేవలం గంటా ఇరవై ఐదు నిమిషాల నిడివి గల ఈ సినిమాలో మీనాక్షి జయన్, రషీద్ రెహమాన్, రాజన్ పూతవక్కల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్లు శ్రీజిత్ ఎస్ కుమార్, గ్రిట్టో విన్సెంట్ డైరెక్ట్ చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


