Vishwambhara: విశ్వంభర రెండు భాగాలుగా.. డైరెక్టర్ వశిష్ట క్లారిటీ.. అవునా అంటూ..
Vishwambhara: విశ్వంభర మూవీ రెండు భాగాలుగా రాబోతోందా? దీనిపై తాజాగా దర్శకుడు వశిష్ట వ్యంగ్యంగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ పుకార్లకు అతడు స్పష్టమైన సమాధానం కూడా ఇచ్చాడు.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ 'విశ్వంభర'పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ ప్రచారానికి దర్శకుడు తనదైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టారు.

పుకార్లపై వశిష్ట సెటైరికల్ కౌంటర్
ప్రస్తుతం టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా తీసినా దాన్ని రెండు భాగాలుగా విడగొట్టడం ఒక ట్రెండ్గా మారింది. 'విశ్వంభర' విషయంలోనూ ఇదే జరగబోతోందని, పార్ట్-1 ఈ ఏడాదే వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి.
దీనిపై దర్శకుడు వశిష్ట స్పందిస్తూ.. "అవునా.. నిజమా?" అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. దీనితో ఈ సినిమా కేవలం ఒకే భాగంగా వస్తుందని, సీక్వెల్ ప్లాన్స్ ఏవీ లేవని స్పష్టమైంది. అనవసరమైన పుకార్లను నమ్మి కన్ఫ్యూజ్ అవ్వద్దని మెగా అభిమానులకు ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు.
విడుదల ఆలస్యానికి అసలు కారణం ఇదే
నిజానికి ఈ సినిమా గతేడాది సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల నాణ్యత విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకోవడంతో విడుదల వాయిదా పడింది. సినిమాలో దాదాపు 4,800కు పైగా గ్రాఫిక్ షాట్స్ ఉన్నాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం విజువల్ వండర్గా ఉండబోతోందని సమాచారం. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాను ఈ ఏడాది జులై 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
భారీ తారాగణం.. అద్భుతమైన సాంకేతికత
మెగాస్టార్కు జోడీగా సీనియర్ నటి త్రిష 'అవని' అనే కీలక పాత్రలో నటిస్తుండగా, విలన్గా కునాల్ కపూర్ కనిపించనున్నారు. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి క్లాసిక్ హిట్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'విశ్వంభర' రెండు భాగాలుగా విడుదల కానుందా?
లేదు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందనే వార్తలను దర్శకుడు వశిష్ట ఖండించారు. ఇది ఒకే భాగంగా విడుదల కానుంది.
2. విశ్వంభర సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం జులై 10, 2026న 'విశ్వంభర' థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
3. విశ్వంభర సినిమాలో త్రిష పాత్ర ఏంటి?
ఈ సినిమాలో త్రిష 'అవని' అనే పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


