బాలీవుడ్ 'ధక్ ధక్' గర్ల్ మాధురీ దీక్షిత్ మరోసారి డిజిటల్ తెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. 2022లో వచ్చిన 'ది ఫేమ్ గేమ్' తర్వాత ఆమె నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'మిసెస్ దేశ్పాండే' (Mrs Deshpande). విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ను సోమవారం (డిసెంబర్ 1) మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మాధురీ మునుపెన్నడూ చూడని విధంగా ఒక సీరియల్ కిల్లర్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మిసెస్ దేశ్పాండే ట్రైలర్

'మిసెస్ దేశ్పాండే' ట్రైలర్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా, భయానకంగా ఉంది. మాధురీ దీక్షిత్ తన దిల్ తో పాగల్ హై మూవీలోని సూపర్ హిట్ పాట "భోలీ సీ సూరత్" పాడుతూ, ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయడం చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.
ఆ తర్వాత ఆమె జైలు కటకటాల వెనుక ఉండి.. "నేను లోపల ఉన్నాను, అంటే బయట ఎవరో నా స్టైల్ని కాపీ చేస్తున్నారు" అని చెప్పే డైలాగ్ ఈ సిరీస్పై అంచనాలను పెంచేసింది. బయటకు ఎంతో కూల్గా, అమాయకంగా కనిపించే మిసెస్ దేశ్పాండే (మాధురీ), గతంలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ అనేది ఈ కథలోని ప్రధాన ట్విస్ట్. డిసెంబర్ 19 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
మిసెస్ దేశ్పాండే వెబ్ సిరీస్ గురించి..
మిసెస్ దేశ్పాండే ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మాధురీ దీక్షిత్ ఇందులో సీరియల్ హత్యల నేరానికి 25 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపిస్తోంది. అయితే అచ్చం ఆమె పద్ధతిలోనే బయట వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. ఆ కొత్త కిల్లర్ను పట్టుకోవడానికి పోలీసులకు మిసెస్ దేశ్పాండే సహాయం అవసరమవుతుంది.
పోలీసులకు సహాయం చేయడానికి ఆమె ఒకే ఒక షరతు పెడుతుంది. అదేంటంటే తన నుంచి దూరంగా ఉంటున్న తన కొడుకు (ప్రస్తుతం పోలీస్ డిటెక్టివ్)తో మాత్రమే తాను కలిసి పనిచేస్తానని చెబుతుంది. విధిలేని పరిస్థితుల్లో తల్లీకొడుకులు కలిసి పనిచేయాల్సి వస్తుంది. వారి మధ్య ఉన్న బంధం, రహస్యాలు, చీకటి గతం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
{{/usCountry}}పోలీసులకు సహాయం చేయడానికి ఆమె ఒకే ఒక షరతు పెడుతుంది. అదేంటంటే తన నుంచి దూరంగా ఉంటున్న తన కొడుకు (ప్రస్తుతం పోలీస్ డిటెక్టివ్)తో మాత్రమే తాను కలిసి పనిచేస్తానని చెబుతుంది. విధిలేని పరిస్థితుల్లో తల్లీకొడుకులు కలిసి పనిచేయాల్సి వస్తుంది. వారి మధ్య ఉన్న బంధం, రహస్యాలు, చీకటి గతం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
{{/usCountry}}ఇది ఫ్రెంచ్ సిరీస్ 'లా మాంటే' (La Mante) కు అధికారిక రీమేక్. 'హైదరాబాద్ బ్లూస్', 'ఇక్బాల్' వంటి చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ దీనిని రూపొందించాడు. మాధురీ దీక్షిత్ టైటిల్ రోల్ పోషించగా, ఆమె కొడుకు/డిటెక్టివ్ పాత్రలో మరాఠీ నటుడు సిద్ధార్థ్ చాందేకర్ కనిపించనున్నాడు. ప్రియాంశు ఛటర్జీ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మాధురీ దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి కావచ్చు. అమాయకమైన ముఖం వెనుక ఉన్న హింసాత్మక ప్రపంచాన్ని ఆమె ఎలా చూపించిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.