నిద్రలోనూ ఏడ్చేదాన్ని.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మృణాల్ ఠాకూర్.. అభిమాని, స్టార్ హీరో మాటలతో మారిన జీవితం
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. బాడీ షేమింగ్, ఆన్ లైన్ ట్రోలింగ్ తో ఎంతో బాధపడ్డట్లు పేర్కొంది. కానీ ఓ అభిమానిని కలవడం, ఓ స్టార్ హీరో సలహాతో తన జీవితమే మారిపోయిందని చెప్పింది.
సీతారామం లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అలాంటి భామ తన జీవితంలో జరిగిన కొన్ని షాకింగ్ అనుభవాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన బాడీ షేమింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్లైన్ ట్రోలింగ్ తో కుంగిపోయినట్లు వివరించింది. ఒక ఫ్యాన్, ఒక స్టార్ హీరో మాటలతో తాను తిరిగి ఆత్మవిశ్వాసం పొందడం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడింది.

బాడీ షేమింగ్
తాను లావుగా ఉన్నాననే బాడీ షేమింగ్ తో దాని గురించే ఆలోచిస్తూ చాలా ఏడ్చేదాన్ని అని గతం గురించి మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. "నాకు అలాంటి కొన్ని రోజులున్నాయి. బాడీ షేమింగ్ వల్ల ఏడుస్తూ పడుకున్న రోజులున్నాయి, నిద్రలోనూ ఏడ్చేదాన్ని. ఎరుపెక్కిన, వాచిన కళ్లతోనే మేల్కొనేదాన్ని. 'ఇది కరెక్ట్ కాదు’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని’’ అని న్యూస్ 18తో మృణాల్ ఠాకూర్ చెప్పింది.
అభిమాని మాటతో
బాడీ షేమింగ్, ఆన్ లైన్ ట్రోలింగ్ కారణంగా తీవ్ర ఆవేదనకు గురైన మృణాల్ ఠాకూర్ ఒక ఫ్యాన్ మాటలతో తిరిగి సంతోషాన్ని పొందగలిగింది. ‘‘ఓ సారి నన్ను ఓ అభిమాని కలిశాడు. నా శరీరాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశాడు. అప్పుడే నేను రియలైజ్ అయ్యా. వేరేవాళ్ల శరీరంలా నా బాడీ ఉండాలని అనుకుంటున్నానని అర్థమైంది. నన్ను నేను ఇష్టపడటం మొదలెట్టా. వేరే వాళ్లు మనల్ని గుర్తించాలని అనుకోవడం కరెక్ట్ కాదనుకున్నా. నాకు నేను ఎంతో విలువైన అమ్మాయిగా అనిపించింది’’ అని మృణాల్ ఠాకూర్ వెల్లడించింది.
అక్షయ్ కుమార్ సలహా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా కూడా తన ఆలోచన విధానాన్ని మార్చిందని మృణాల్ ఠాకూర్ పేర్కొంది.
"నేను అక్షయ్ సర్ను కలిశా. 'నీ ఈ రూపాన్ని నువ్వు అంగీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను రెచ్చగొట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. అనవసరమైన వెయ్యి మాటలు చెప్పే గొంతులు నీ చుట్టూ ఉన్నా నువ్వు వినకపోవడం చాలా గొప్ప విషయం. నీకు ఏది అనిపిస్తే అదే చేయ్. ఒక పాత్ర కోసం బరువు తగ్గాలనుకుంటే తగ్గు’ అని అక్షయ్ చెప్పాడు. ఆ మాటలు నాపై ప్రభావం చూపాయి’’ అని మృణాల్ చెప్పింది.
లేటెస్ట్ మూవీ
మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ మూవీ 'దో దీవానే సేహర్ మే' ఫిబ్రవరి 20, 2026న రిలీజ్ అయింది. ఈ హిందీ మూవీలో సిద్ధార్థ్ చతుర్వేది హీరో. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో రూ.45 కోట్లు కలెక్ట్ చేసింది.

E-Paper












